Telangana BJP : బీజేపీలో చేరిన 300 మంది యువతీ యువకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్ లలో నుండి యువత ముందుకు వచ్చి బీజేపీ లో చేరడం హర్షణీయం అన్నారు హైదరాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు. యూసుఫ్ గూడ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన సమక్షంలో 300 మందికి పైగా యువతీ యువకులను ఆయన బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధాన మంత్రి గా చూడాలని యువత బలంగా కోరుకుంటున్నట్లు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోయిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా సమస్యలను పట్టించుకోవట్లేదని, పోలీస్ వ్యవస్థ ను పెట్టుకొని దుర్మార్గమైన పాలన నడిపిస్తున్నారని,అన్ని డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ అతలాకుతలం అయ్యాయని, జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ చేరికలు అందుకు సాక్ష్యంగా నిలుస్తాయని అన్నారు.
Also Read : Hyderabad: తండ్రి మందలించాడు.. గాజు పెంకుతో గొంతు కోసిన కూతురు
Also Read
- Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
- Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పద్మ వీరపనేని మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ సిద్దాంతాలకు మెచ్చి అన్ని డివిజన్ లలోని యువతీ యువకులు పార్టీ లో చేరారని,గత తొమ్మిది సంవత్సరాలనుండి బి ఆర్ ఎస్ పరిపాలనలో జూబ్లీహిల్స్ సమస్యలు ఎక్కడికక్కడ గాలికి వదిలేశారని,పేదల గోడు పట్టించుకునే నాధుడు లేడని, పెన్షన్ లు రాకపోయిన, వరదలతో రోడ్లు అద్వాన్నంగా ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం వల్ల ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు.చిన్న చిన్న సమస్యలు తీర్చడంలో సైతం ప్రభుత్వం విఫలమైందన్నారు. డబులు బెడ్ రూమ్, డంప్ యార్డ్ వంటి అనేక సమస్యలపై పోరాడ గలిగే శక్తి ఒక్క బీజేపీ కి మాత్రమే ఉందని, జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే రానున్న ఎన్నికలలో బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని అందుకు తార్కాణమే ఈ చేరికలు అన్నారు.ఈ సందర్బంగా పాటి వెంకటేశ్వరరావు,త్రిమూర్తులు,సయ్యద్ ఫైజల్, బుజ్జిబాబు,సురేష్, శ్రీనివాస్ రాజ్,మహేష్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు బీజేపీ లో చేరారు.
Also Read : PMSBY: కేవలం రూ.20లకే రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం ప్రత్యేకత తెలుసుకోండి
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!