Jamili Elections: జమిలి ఎన్నికలపై పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Govt key announcement in Parliament on Jamili election: కేంద్రం జమిలి ఎన్నిలకు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై కేంద్రం పార్లమెంట్ లో కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశం పరిశీలనలో ఉందని తెలిపింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సీఈసీతో చర్చించామని వెల్లడించింది. అలాగే అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించామని కేంద్రం వెల్లడించింది. అయితే ఈ జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని.. ప్రస్తుతం ఇవి లా కమిషన్ పరిశీలిస్తుందని.. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తుందని వెల్లడించింది. వేరువేరుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతోందని..ఈ ఎనిమిదేళ్లలో రూ.7 వేల కోట్లు ఎన్నికల కోెసం ఖర్చు చేశామని కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది.
ఎన్నికల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారుతున్న తరుణంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. పార్లమెంట్ కు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజధనాన్ని ఆదా చేసే అవకాశం ఉందని బీజేపీ సర్కార్ భావిస్తోంది. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. ‘‘ వన్ నేషన్- వన్ ఎలక్షన్’’లో భాగంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీయే సర్కార్ కొత్త విధానాన్ని తీసుకురావాలని అనుకుంటుంది.
Also Read
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
Read Also: Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. మూడుకు చేరిన కేసుల సంఖ్య
స్వతంత్ర భారతదేశంలో 1952 నుంచి 1967 కాలం మధ్యలో నాలుగు సార్లు పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు జరిగాయి. 1952, 1957, 1962,1967 సార్లు జమిలి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత పలు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడం వంటి కారణాల వల్ల జమిలి ఎన్నికలకు బ్రేక్ పడింది. ఏ రాష్ట్రంలో ఐదేళ్ల పదవీ కాలపరిమితి ముగిస్తే ఆ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం లా కమిషన్ జమిలి ఎన్నికలపై అధ్యయనం చేస్తుంది. ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంలో ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణకు దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల ఇది సాధ్యం అయ్యే అవకాశాలే ఎక్కువ.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్లో అల్లర్లు.. తగలబడ్డ కార్లు, భవనాలు
-
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్కు విలువైన పాఠం..!
-
Pakistan: పీవోకేలో కూలిన పాక్ హెలికాప్టర్.. 21 మంది సైనికులు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!