Cyber Criminals: ఆన్లైన్లో చీర వాపస్ ఇవ్వబోతే.. 2లక్షలు కాజేసి రిటన్ గిప్ట్ ఇచ్చిన సైబర్ నేరగాల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Shopping website fraud: ఏదైనా ఓకేషన్ లేదా.. పండుగలు వస్తే చాలు షాపింగ్లకు ఎగబతుంటాము. ఇక ఆఫర్లు వస్తే ఆ.. ఆనందమే వేరు. బయటకు వెల్లకుండా ఆన్లైన్లో అయితే 50శాతం ఆఫర్ అంటే చాలు తెగ ఆర్డర్లు ఇచ్చేస్తుంటాము. నచ్చక పోతే ఆన్లైన్లోనే వాపస్ ఇచ్చేయచ్చుగా అనే ఒక్క ఆప్షన్ తో ఆర్డర్లు మీద ఆర్డర్లు ఎగబడుతుంటారు. ఇంట్లో నుంచి కొందరు బయటకు వెల్లలేని పరిస్థితుల్లో ఈఆన్లైన్ ఆర్డర్లు వచ్చాయి. దీంతో ఇంట్లోనుంచే ఆర్డర్లు ఇస్తూ.. నచ్చకపోతే కూడా వెనక్కు ఇచ్చేయచ్చు కదా.. అనే ఆప్షన్తో కూర్చున్న చోటే వస్తుంది కాదా అనే సౌకర్యంతో.. తెగ ఆర్డర్లు ఇస్తుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. వారు ఆన్లైన్లో ఆర్డర్లు ఇస్తున్న తీరును టార్గెట్ చేస్తూ వారి ఖాతాలోంచి డబ్బును మాయం చేస్తున్నారు. ఎదోఓరూపంలో సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలంలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలానికి చెందిన ఓ మహిళ ఖాతాలో రూ. 6.04 లక్షలున్నాయి. ఓరోజు బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలించగా రూ. 2.04 లక్షలు ఉపసంహరించినట్లు ఉంది. ఇటీవల ఆమె పది హేనేళ్ల కుమారుడు ఆన్లైన్లో రెండు చీరలు ఆర్డర్ చేశాడు. ఇంటికొచ్చాక అవి నచ్చకపోవడంతో తిరిగి ఇవ్వాలనుకున్నాడు. ఆన్లైన్లో సంబంధిత సంస్థ కస్టమర్ కేర్ నంబరు వెతికి ఫోన్ చేశాడు. కస్టమర్ కేర్ ప్రతినిధినంటూ ఓ వ్యక్తి హిందీలో మాట్లాడాడు. చీరలు వెనక్కి తీసుకోవాలంటే తాను పంపిన లింకు తెరిచి వివరాలు నింపాలని సూచించాడు. బాలుడు అలాగే చేశాడు. బ్యాంకు ఖాతా నుంచి మొత్తం 3 వేర్వేరు లావాదేవీల ద్వారా ఏకంగా వేలల్లో కాదు.. రూ.2.04 లక్షల్లో కొట్టేసినట్లు గుర్తించారు. ఖంగుతిన్న బాధితులు ఈ వ్యవహారంపై తొలుత బాధితురాలు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ కమిష సర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా మరోసారి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు కాస్త జాగ్రత్తగా వుండండంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Kusal Mendis: అత్యంత చెత్త రికార్డ్.. టోటల్గా 26
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!