Ayodhya Ram Mandhir: హైదరాబాద్ నుంచి అయోధ్యకు.. 1,265 కిలోల భారీ లడ్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandhir: అయోధ్య శ్రీరాముడి దగ్గర హైదరాబాద్లో భారీ లడ్డూలు తయారయ్యాయి. హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారిలు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 1,265 కిలోల భారీ లడ్డూను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వారు దానిని అయోధ్యకు పంపుతారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ నుంచి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన వరకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే నెంబరుతో లడ్డూను తయారు చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు పికెట్లోని తమ నివాసం నుంచి లడ్డూ శోభాయాత్ర ప్రారంభించారు. ఈ విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధి చంపత్రాయ్ను సంప్రదించి అనుమతి పొందారు. ఆయన సూచనలతో 1,265 కిలోల బరువున్న లడ్డూలను తయారు చేశామన్నారు.
Read also: Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రసాద సామగ్రి..
విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్యకర్తలు హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రసాద సామగ్రిని పంపారు. బషీర్ బాగ్లోని శ్రీ నాగలక్ష్మీ మాత దేవాలయం నుండి అయోధ్య ధామ్ వరకు వెళ్తున్న ప్రసాద సామగ్రి వాహనాన్ని జెండాను ఎగురవేశారు. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి రామారావు మాట్లాడుతూ దాతల సహకారంతో 45 రోజులపాటు నిత్యం 5 వేల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అయోధ్యలో అన్నదానం కోసం కమిటీని నియమించింది. ఈ కార్యక్రమం సంక్రాంతి (14) నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగింది. హైదరాబాద్ నుంచి దాదాపు 150 మంది విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్యకర్తలు వాలంటీర్లుగా అయోధ్య వెళ్తున్నారని తెలిపారు. అలాగే రోజూ 35 మంది వంటవాళ్లు వండి వడ్డించబోతున్నారు. అయోధ్యలోని గోలాఘాట్ రోడ్డులో ఉన్న శ్రీరామస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఆహార తయారీకి అవసరమైన 40 టన్నుల వివిధ సామాగ్రిని ఇప్పటికే సేకరించి అవసరమైన దాతల నుండి పంపినట్లు రామారావు తెలిపారు.
Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!