Telangana Elections 2023: తాండూరులో తీవ్ర ఉద్రిక్తత.. నర్సాపూర్ లో కార్లపై దాడుల పర్వం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BRS at Tandur: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు సజావుగానే సాగుతున్నా కొన్నిచోట్ల మాత్రం చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో సాయి పూర్ లోని పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా సేపు పోలింగ్ కేంద్రంలో రోహిత్ రెడ్డి ఉండడంతో కాంగ్రెస్ నాయకుల నినాదాలు మొదలు పెట్టారు, రోహిత్ రెడ్డి రిగ్గింగ్ పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఆ అనంతరం పోలింగ్ కేంద్రం బయట కాంగ్రెస్ నాయకుల ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఝుళిపించారు డీఎస్పీ శేఖర్ గౌడ్. బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని రోడ్డుపై కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు.
Telangana Elections 2023: పోలింగ్ బూత్ ముందు తగలబడిన చెట్టు..ఆందోళనలో ఓటర్లు!
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
ఈ క్రమంలో పోలీసులు వారిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోపక్క మెదక్ జిల్లా నర్సాపూర్ లో కార్లపై దాడుల పర్వం చర్చనీయాంశం అయింది. పరస్పరం వాహనాలపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగుతున్న అంశం హాట్ టాపిక్ అయింది. శివ్వంపేట మండలం భీమ్లా తండాలో కాంగ్రెస్ కార్యకర్త కారుపై దాడి జరిగింది, ఈ దాడిలో కాంగ్రెస్ కార్యకర్త సుధీర్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ దాడి బీఆర్ఎస్ కార్యకర్తలే చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఇక మరో పక్క కాసేపటి క్రితమే నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కుమారుడి కారుపై కొంత మంది వ్యక్తులు దాడి చేసిన అంశం కూడా తెర మీదకు వచ్చింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ (మం) అడ్వాలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. 244 ,245 పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో గుంపుగా ఉన్న ఓటర్లను పోలీసులు అదుపు చేసే క్రమంలో ఓటర్ల పై లాఠీ ఝుళిపించారు పోలీసులు, ఈ క్రమంలో ముగ్గురికి గాయాలు కావడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఓటర్లు. దీంతో ఓటింగ్ కొద్దిసేపు ఆగింది.
తాజావార్తలు
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!