ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చిన ఘనత వాట్సాప్ది. మరీ ముఖ్యంగా యువత అభిరుచికి అనుగుణంగా ఫీచర్స్ను అందిస్తోంది.. అందుకే రోజు రోజుకు వాట్సాప్ వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది..
తాజాగా మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈసారి గ్రూప్ కాల్స్ కోసం ఈ ఫీచర్ను తీసుకొచ్చారు. గ్రూప్ కాల్స్లో వాయిస్ ఛాట్స్ ఫీచర్ను వాట్సాప్ ప్రారంభించింది. ఆండ్రాయిడ్తో పాటు ఐఫోన్ యూజర్లకు ఈ అప్డేట్ను తీసుకొచ్చింది వాట్సాప్.. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి.. ఎలా దీన్ని ఎనెబుల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రూప్లోని సభ్యులందరికీ నోటిఫికేషన్తో పాటు రింగ్టోన్ వస్తుంది. ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నా, మీటింగ్లో ఉన్నా గ్రూప్ కాల్ వస్తే డిస్బర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది.. గ్రూప్ లో కాల్ వస్తే ఎటువంటి డిస్టబెన్స్ రాదు.. సైలెంట్ నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది.. వారు కాల్ ముగిసేలోపు ఎప్పుడైనా జాయిన్ కావొచ్చు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో కేవలం 60 నిమిషాలు మాత్రమే మాట్లాడొచ్చు. ఆ తర్వాత దానంతటదే కాల్ కట్ అవుతుంది. కాల్లో జాయిన్ అయిన వారు మాత్రమే వాయిస్ ఛాట్ను వినొచ్చు.. అలాగే వారి ప్రొఫైల్ ను కూడా చూడొచ్చు..
ఇకపోతే ఈ వాయిస్ చాట్ల్లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను తీసుకొచ్చారు. దీంతో సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ఇక గ్రూప్ చాట్లో పైన రైట్సైడ్ కనిపించే వేవ్ఫార్మ్ ఐకాన్పై క్లిక్ చేసి వాయిస్ చాట్ ప్రారంభించవచ్చు.. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ను 33 పైబడి సభ్యులున్న గ్రూపులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.. త్వరలోనే చిన్న గ్రూప్ లు ఉన్న వారికి కూడా అందుబాటులోకి తీసుకొని రానున్నట్లు వాట్సాప్ టెక్నీకల్ టీమ్ చెబుతున్నారు..