మీరు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారా..? ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారా..? అయితే, అక్షరాల పరిమితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా..? అయితే, ఇక, నో టెన్షన్.. ఎందకంటే సోషల్మీడియా దిగ్గజం ట్విట్టర్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తూ వస్తున్న ట్విట్టర్.. ఇప్పుడు ట్వీట్ ఎడిట్ ఫీచర్ను టెస్టింగ్లో పెట్టింది.. అంతే కాదు.. మరో ఫీచర్ను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటి వరకు కేవలం 280 అక్షరాలతోనే ట్వీట్ చేసే అవకాశం ఉండగా.. అక్షరాలు పెరిగితే.. మరో ట్వీట్ను జోడించాల్సిన పరిస్థితి ఉండేది.. కానీ, ఇప్పుడు అక్షరాల పరిమితిని 280 నుంచి ఏకంగా 2,500కు పెంచాలనే ప్లాన్లో ఉంది సోషల్ మీడియా దిగ్గజం.
Read Also: Another Atrocity In Hyderabad: హైదరాబాద్లో మరో దారుణం.. 17 ఏళ్ల బాలికపై..!
ఇక, ట్విట్టర్ అక్షరాల పరిమితి కోసం నోట్స్ పేరిట కొత్త ఫీచర్ను తీసుకురాబోతోంది… ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. అంటే, సుదీర్ఘమైన ట్విట్ చేయొచ్చు అన్నమాట.. అంతేకాదు.. ఫొటోలు, వీడియోలు, జీఐఎఫ్ఎస్ వంటివి కూడా జోడించే వెసులుబాటు తీసుకొస్తుంది. ట్వీట్ చేసే ముందు ప్రివ్యూకు కూడా అవకాశం ఇస్తున్నారు.. అమెరికా, యూకే, కెనడా లాంటి దేశాల్లో ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నారు.. ప్రస్తుతం చిన్న సమూహంతో క్లోజ్డ్ టెస్ట్ని నడుపుతున్నాం. వారు ట్విట్టర్లో వ్రాయడానికి వచ్చిన వ్యక్తులకు ఎలా ఉత్తమ సేవలు అందించాలో తెలుసుకోవడానికి మాకు సహాయపడతారు.. అని ట్విట్టర్ పేర్కొంది.. వాస్తవానికి, మొదట ట్వీట్ అక్షరాల పరిమిత 140 మాత్రమే.. 2017లో ఆ పరిమితిని 280 అక్షరాలకు పెంచారు.. త్వరలోనే అది 2500 అక్షరాలకు చేరుకోబోతంది.. కాగా, ట్విట్టర్ను టెస్లా సీఈవో ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే వ్యవహారం మధ్యలోనే ఉన్న విషయం తెలిసిందే.