Tardigrade: ఇది మృత్యుంజయురాలు..సూర్యుడు నాశనమయ్యే వరకు ఈ జీవికి మరణం లేదు!
- భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చావాల్సిందే
- చావు లేని జీవి కూడా ఉందంటే నమ్ముతారా?
- కాని ఇది నిజం
- నీటి ఎలుగు బంటిగా పిలుచుకునే జీవికి చావు లేదు
- ఎలాంటి పరిస్థితిలో అయిన బతికేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమిపై పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజు చావాల్సిందే. పుట్టిన వారు మరణించక తప్పదు..మరణించిన వారు జన్మించక తప్పదని హిందువుల ఆరాధ్య గ్రంధం భగవద్గీత చెబుతోంది. ప్రతి మనిషికి మరణం ఎలా ఉంటుందో? ఇతర జీవులు కూడా ఏదోనాడు చావు తప్పదు. అయితే అవి కొన్ని ఎన్నేళ్ల వరకు బతికుంటాయనేది వాటి జీవనవిధానంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఈ భూమిపై ఓ జీవికి మాత్రం చావు లేదు. ఏదైనా ప్రళయం వచ్చినా.. మానవ జాతి భూమి నుంచి తుడిచిపెట్టుకుపోయినా కూడా ఈ అర మిల్లీమీటరు జీవి మాత్రం ఇక్కడ హాయిగా జీవించ గలదు. సూర్యుడు నాశనమయ్యే వరకు ఈ జీవికి మరణం లేదు. ఈ జంతువు ఆహారం, నీరు లేకుండా ఏకంగా 30 సంవత్సరాలు సుఖంగా జీవిస్తుంది.
READ MORE: Nizam College: అబిడ్స్ లో ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జామ్
Also Read
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
సాధారణంగా ఉష్ణోగ్రత 50 దాటితేనే మనుషులు భరించలేరు. అలాంటిది 150 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ జీవి దిట్టలా బతికే ఉంటుంది. ఇక మైనస్ -457 డిగ్రీల చలి ఉంటే.. ఎన్నో జీవులు ప్రాణాలు కోల్పోతాయి. మానవులు అస్సలు తట్టుకోలేరు. కానీ దీనికి మాత్రం చీమకుట్టినట్లు కడా అనిపించదు. ఇది పూర్తిగా చనిపోవాలి అంటే సూర్యుడు నాశనం అవ్వాలి. ఈ అద్భుతమైన జీవి పేరు “టార్డిగ్రేడ్”. తెలుగులో దీన్ని నీటి ఎలుగుబంటి అని పిలుస్తారు. ఈ జీవి ప్రపంచం అంతమయ్యే వరకు జీవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి ఎలుగుబంటికి అంత శక్తి ఉందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నీటి ఎలుగుబంటి పొడవు కేవలం 0.5 మిల్లీమీటర్లు మాత్రమే. ఇంత చిన్న పరిమాణంలో ఉన్న జీవిని మానవుడు కళ్లతో చూడలేడు.
READ MORE: Neeraj Chopra: రేపే క్వాలిఫికేషన్ రౌండ్.. ‘గోల్డ్’ ఆశలు నీరజ్ చోప్రా పైనే! భారత్ నుంచి మరో ప్లేయర్
మరుగుతున్న నీటిలో ఉడకబెట్టినా.. మంచులో గడ్డకట్టినా ఈ జీవి 200 సంవత్సరాలు జీవించగలదు. నిజానికి ఏదైనా గ్రహ శకలం భూమిని ఢీ కొడితే సర్వం నాశనం అవుతాయి. లేదా ఏదైనా నక్షత్రం పేలినప్పుడు గామ కిరణాలు విడుదలై భూమి మొత్తం తుడుచుపెట్టుకు పోతంది. అయితే అలాంటి సమయంలో కూడా నీటి ఎలుగుబంటి మాత్రమే మనుగడ సాగిస్తాయి. ఈ అద్భుతమైన జీవిని మృత్యుంజయురాలిగా అభివర్ణించవచ్చు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!