Redmi 15 5G, Note 15 5G: భారీగా పెరిగిన రెడ్మీ 5G ఫోన్ల ధరలు!.. కొత్త ధరలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యశ్రేణి స్మార్ట్ఫోన్ కొనాలని భావిస్తున్న వినియోగదారులకు రెడ్మీ షాక్ ఇచ్చింది. కంపెనీకి చెందిన రెడ్మీ 15 5G, రెడ్మీ Note 15 5G స్మార్ట్ఫోన్ల ధరలను పెంచినట్లు సమాచారం. రెండు ఫోన్ల అన్ని వేరియంట్లపై ఏకరీతిగా రూ.2,000 పెంపు అమలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి.
లీకైన షియోమీ అంతర్గత పత్రం ద్వారా ఈ ధరల పెంపు వెలుగులోకి వచ్చింది. టిప్స్టర్ సంజు చౌదరి తన ‘X’ సోషల్ మీడియా ఖాతాలో ఈ వివరాలను పంచుకున్నారు. మే 25, 2026 తేదీతో ఉన్న ఈ పత్రాన్ని Mi హోమ్ స్టోర్లు, ఆఫ్లైన్ రిటైల్ భాగస్వాములకు పంపినట్లు సమాచారం.
Also Read
- Amazon Prime Day Sale: రూ.30,000 లోపు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్పై ఎంత ఆఫర్?
- ASUS Vivobook 15 2026: కొత్త ఇంటెల్ ప్రాసెసర్, 15.6-ఇంచెస్ డిస్ప్లేతో ఆసుస్ ల్యాప్టాప్ విడుదల.. ధర ఎంతంటే?
- పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై 'Telegram'కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
- Dell Alienware 15: డెల్ ఏలియన్వేర్ 15 గేమింగ్ ల్యాప్టాప్ భారత్లో విడుదల.. RTX 4050 GPU, AMD Ryzen ప్రాసెసర్
రెడ్మి 15 5G కొత్త ధరలు
6GB + 128GB వేరియంట్ ధర రూ.18,499 నుంచి రూ.20,499కు పెరిగింది.
8GB + 128GB వేరియంట్ ధర రూ.20,499 నుంచి రూ.22,499కు చేరింది.
8GB + 256GB వేరియంట్ ధర రూ.22,499 నుంచి రూ.24,499కు పెరిగింది.
రెడ్మి నోట్ 15 5G కొత్త ధరలు
8GB + 128GB వేరియంట్ ధర రూ.24,999 నుంచి రూ.26,999కు పెరిగింది.
8GB + 256GB వేరియంట్ ధర రూ.27,999 నుంచి రూ.29,999కు చేరింది.
ఈ విధంగా అన్ని మోడళ్లపై రూ.2,000 చొప్పున ధరలు పెరిగాయి.
2026లో మరింత పెరిగే అవకాశం?
ధరలను పెంచుతున్నది కేవలం రెడ్మి మాత్రమే కాదు. భారత మార్కెట్లో ఉన్న పలు స్మార్ట్ఫోన్ బ్రాండ్లు కూడా ఉత్పత్తి వ్యయాలను నియంత్రించేందుకు ధరలు పెంచడం లేదా నిశ్శబ్దంగా స్పెసిఫికేషన్లలో మార్పులు చేయడం ప్రారంభించాయి. దీనికి ప్రధాన కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న RAM మెమరీ కొరతను పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా AI డేటా సెంటర్ల నుంచి భారీగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా మెమరీ చిప్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ప్రభావం రాబోయే నెలల్లో మరిన్ని స్మార్ట్ఫోన్ల ధరలపై పడే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!