Pig kidney In Human: మానవశరీరంలో పంది కిడ్నీ.. భవిష్యత్తుపై ఆశలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pig kidney In Human: మానవ అవయవాలు విఫలమైతే వేరే వ్యక్తులు దానం చేస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొన్ని సందర్బాల్లో అవయవాలు దొరకకపోవడం, దొరికినా సెట్ కాకపోవడం వల్ల మనుషులు మరణిస్తున్నారు. అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు, వైద్యులు కొన్ని ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని మానవుడికి అమర్చారు. ఇది ఏకంగా రెండు నెలల పాటు పనిచేసింది, భవిష్యత్తులపై ఆశలను పుట్టించింది. బ్రెయిన్ డెడ్ అయి, వెంటిలేటర్ పై ఉన్న ఓ వ్యక్తికి పంది కిడ్నీని అమర్చి పరిశోధన నిర్వహించారు.
న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్లో ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అయిన డాక్టర్ రాబర్ట్ మోంట్గోమెరీ నేతృత్వంలో జరిగిన ఈ ప్రయోగం బుధవారం ముగిసింది. బ్రెయిన్ డెడ్ అయిన మిల్లర్ అనే వ్యక్తి కిడ్నీని తొలగించి, పంది కిడ్నీని అమర్చారు. అతడిని రెండు నెలలు వెంటిలేటర్ పై ఉంచి డాక్టర్ల బృందం పరిశోధన సాగించింది. పరిశోధన ముగిసిన తర్వాత మిల్లర్ శరీరం నుంచి పంది కిడ్నీని తొలగించి దహనసంస్కారాలకు పంపారు.
Also Read
- Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
- Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
Read Also: IND vs BAN: టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
జన్యుపరంగా మార్పు చేసిన పంది కిడ్నీ మానవ శరీరంలో సుదీర్ఘకాలంగా పనిచేసినట్లు గుర్తించారు. ఈ ప్రయోగ ఫలితాలను యూఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(FDA)తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. క్యాన్సర్ కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన మిల్లర్ శరీరాన్ని పరిశోధన కోసం వాడుకునేందుకు ఆయన సోదరి మేరీ మిల్లర్-డఫీ శరీరాన్ని దానం చేశారు. జూలై 14న మిల్లర్ పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందు వైద్యులు అతడి కిడ్నీని తొలగించి, జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని అమర్చారు.
పంది కిడ్నీకి, దాని థైమస్ గ్రంథిని మిల్లర్ కి అమర్చారు. థైమస్ గ్రంథితో రోగనిరోధక కణాలకు శిక్షణ ఇచ్చారు. అయితే కిడ్నీ ఒక నెలపాటు విజయవంతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేసింది. అయితే తర్వాతి నెలలో మూత్రం తగ్గిపోవడం వంటి సమస్యలను చూశారు. అంటే మానవశరీరం పంది కిడ్నీని తిరస్కరిస్తుందనే దానికి ప్రథమ సంకేతమని గుర్తించారు. అయితే ఇమ్యూన్ సప్రెస్ మెడిసిన్స్ తో వైద్యులు ఈ ప్రమాదాన్ని పరిష్కరించారు.
గతంలో ఇలాగే మేరే జంతువు అవయవాలను మానవ శరీరం వెంటనే రిజెక్ట్ చేసేది. అయితే జన్యుపరంగా మార్పు చెందిన పంది అవయవాల ద్వారా, భవిష్యత్తులో జంతు అవయవాలను మార్పిడి చేయవచ్చనే ఆశను కల్పించింది. తదుపరి పరిశోధనల్లో జెనోట్రాన్స్ప్లాంట్ కారణంగా ఏవైనా సమస్యలు వచ్చాయా..? లేదా..? అని తెలుసుకునేందుకు ప్రధాన అవయవాలు, లింప్ నోడ్స్, జీర్ణాశయ వ్యవస్థలోని 180 రకాల టిష్యూలపై పరిశోధనలు చేస్తారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!