Human Washing Machine: ఓరి దేవుడా మనుషులకు స్నానం చేయించే మెషీన్లు కూడా వచ్చేశాయ్..
- త్వరలో మనుషులను ఉతికి ఆరేసే హ్యూమన్ వాషింగ్ మెషీన్లు..
- మెషీన్ టబ్లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు.. తలతలలాడే శరీరంతో బయటకు వస్తారు..
- వచ్చే ఏడాది ఏప్రిల్లో ఒసాకాలోని ఎక్స్పో 2025లో ఈ మెషీన్లు ప్రదర్శించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Washing Machine: ప్రస్తుత జనరేషన్ లో మనం కేవలం బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్లు మాత్రమే చూస్తున్నాం.. కొన్నాళ్ల తర్వాత బట్టలు ఉతికి ఆరేసినట్లు.. మనుషులను ఉతికి ఆరేసే మెషీన్లు రాబోతున్నాయి.. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వారికి స్నానం చేసే ఓపిక ఉండకపోతే.. మెషీన్ టబ్లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు.. కాసేపటి తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు వస్తారట.
Read Also: Burra Venkatesham : “నేనున్నా.. ధైర్యంగా పరీక్షలు రాయండి” నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ హామీ
Also Read
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
అయితే, జపాన్కు చెందిన ‘సైన్స్ కో’ కంపెనీ ఇంజనీర్లు ఈ మెషీన్ను తయారు చేసినట్టు ఓ వార్త సంస్థ కథనం ప్రసారం చేసింది. ఇది ఈ మెషీన్లోని ఆ వ్యక్తి శరీరం, చర్మం తీరును బట్టి వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుందన్నారు. ఒసాకా కన్సాయ్ ఎక్స్పోలో 1,000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవటానికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వర్షన్ను రిలీజ్ చేస్తామని జపనీస్ షవర్హెడ్ సంస్థ సైన్స్ కో కంపెనీ చైర్మన్ ఆయోమా వెల్లడించారు.
Read Also: Delhi: ఉబర్కు కోర్టు షాక్.. టైమ్కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్
ఇక, మనుషుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జపాన్ ఇంజినీర్లు దీన్ని రూపొందించారు. ఈ ఫైటర్జెట్ కాక్పీట్ ఆకారంలోని ప్లాస్టిక్ ప్యాడ్లోకి మనిషి వెళ్లిన తర్వాత.. అది సగానికిపైగా గోరు వెచ్చని నీటితో నిండుతుంది. ఆ తర్వాత అందులోని హైస్పీడ్ జెట్స్ నీటిని వేగంగా చిమ్ముతాయి. స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపర్చేందుకు ఇందులో మరిన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మెషీన్ సేకరించి.. దానికి అనుగుణంగా పని చేస్తుందని సైన్స్ కో కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఒసాకాలోని ఎక్స్పో 2025లో మిరాయ్ నింగెన్ సెంటకుకిని ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!