Burra Venkatesham : “నేనున్నా.. ధైర్యంగా పరీక్షలు రాయండి” నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ హామీ
- అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం నా బాధ్యత
- ఇక మీద పరీక్ష వాయిదాలు ఉండవు
- Tgpsc రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తాం
- టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వ్యాఖ్యలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. వాయిదాలు ఉండవని.. అలాంటి ఆలోచనలు ఉంటే తొలగించుకోండన్నారు. డీఎస్సీ ఫలితాలు 60 రోజుల్లో ఇవ్వగలిగినట్లు తెలిపారు. Tgpsc రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తామని హామీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. అంతా పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే మూడున్నర ఏళ్ల సర్వీస్ ను వదులుకొని వచ్చినట్లు తెలిపారు. యూపీఎస్సీ తో సమానంగా tgpsc పని చేస్తుందని కొనియాడారు.
READ MORE: Delhi: ఉబర్కు కోర్టు షాక్.. టైమ్కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్
Also Read
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
- Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
- Grok's Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
తన మీద నమ్మకం తో పరీక్షలు రాయాలని.. ఎవరైనా పైరవీ చేస్తా నంటే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పబ్లిక్ కు అందుబాటులో ఒక ఫోన్ నంబర్ పెడతామని చెప్పారు.
Tgpsc ఛైర్మన్ కు ఉన్నా విస్తృత అధికారాలను వినియోగించుకొని న్యాయం చేస్తామని వివరించారు. తెలంగాణ గెలిచి నిలవాలన్నారు.. ఐఏఎస్ కావాలని తన కల సాకారం అయిందని.. రాజీనామా చేసి ఇప్పుడు నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.
READ MORE: Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..
కాగా.. టీజీపీఎస్సీ చైర్మన్గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 3తో మహేందర్రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 వరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ గా వెంకటేశం కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!