Sachin Holi Celebrations: దేశవ్యాప్తంగా హోలీ పండుగ నాడు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు రంగులు పూసుకుంటూ ఆనందంగా వేడుకలో ఎంజాయ్ చేసారు. హోలీ అంటే కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు కూడా ప్రత్యేకమైనదే. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ గా పిలిచే సచిన్ టెండూల్కర్ సైతం కూడా తన తోటి క్రికెటర్లతో కలిసి హోలీ వేడుకలను మరింత సందడిగా మార్చాడు. Read Also: Health Tips: అలాంటి వ్యక్తులు నాన్…
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (ఐఎమ్ఎల్) 2025లో ఇండియా మాస్టర్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం రాయపూర్ వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్తో జరిగిన సెమీఫైనల్లో ఇండియా 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల ఛేదనలో ఆసీస్ 18.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా తరఫున యువరాజ్ సింగ్ (59; 30 బంతుల్లో 1×4, 7×6) సిక్సర్ల మోత మోగించగా.. షాబాజ్ నదీమ్ (4/15) బంతితో మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన షాబాజ్కు…
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ‘ఇండియా మాస్టర్స్’ దూసుకెళుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బుధవారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. సచిన్ 21 బంతుల్లోనే 34 పరుగులు చేయగా.. యువరాజ్ సింగ్ 14 బంతుల్లో 27 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. తొలి మ్యాచ్లో శ్రీలంక మాస్టర్స్పై ఇండియా మాస్టర్స్ గెలిచిన విషయం తెలిసిందే. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్…
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఎన్నో ముఖ్యమైన మ్యాచ్లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ల్లో యువరాజ్ ముందుండి నమ్మకంగా ఆడాడు. అయితే.. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ గురించి ఆయన మాట్లాడుతూ, "ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ఫైనల్ లాగా అనిపిస్తుందని తెలిపారు.
దాయాదుల మధ్య జరిగే బ్లాక్ బస్టర్ పోరులో గొప్ప ప్రదర్శన చేసే ప్లేయర్స్ ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్, షాహిద్ అఫ్రిదీ తెలియజేశారు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున శుభ్మన్ గిల్ అత్యధిక రన్స్ చేస్తాడని.. అటు బౌలింగ్ లో మహమ్మద్ షమీఎక్కువ వికెట్లు తీస్తాడని యువీ పేర్కొనగా.. పాకిస్థాన్ వైపు బ్యాట్తో బాబర్ అజామ్ .. బాల్ తో షాహిన్ అఫ్రిదీ ఆకట్టుకుంటారని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు.
బ్రెస్ట్ క్యాన్సర్పై అవేర్నెస్ క్యాంపెయిన్ను టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యువీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘యూవీకెన్’ బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పిస్తోంది. ఈ ఎన్జీవో దేశంలోని మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు యాడ్లు చేస్తుంటుంది. తాజాగా యూవీకెన్ చేసిన యాడ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘యువరాజా.. ఇదేం అవేర్నెస్ క్యాంపెయిన్’ అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు మహిళలు తరచూ తమని తాము పరిశీలించుకోవాలంటూ…
Yuvraj Singh Reveals His Favourite India Captain: 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకోవడంలో మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది. తన బ్యాటింగ్, బౌలింగ్తో ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇన్నింగ్స్ చివరలో 21 బంతుల్లో 11 రన్స్ మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ఆపై జట్టులో చోటు దక్కకపోవంతో యూవీ 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. తాజాగా ఓ…
గ్రేట్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభంలోనే చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్స్లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఆ విధ్వంసానికి గురువారంతో 17 ఏళ్లు. ఈ క్రమంలో బ్రాడ్ స్పందించాడు. అంపైర్ నో బాల్ ఇస్తే.. యువరాజ్ ఏడు సిక్సర్ కొట్టేవాడని బ్రాడ్ చెప్పాడు.
Yuvraj Singh 6 balls 6 Sixers: భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజును ఏ అభిమానులూ మర్చిపోరు. ఈ రోజున 17 సంవత్సరాల క్రితం, మొదటిసారి జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఈ రోజు గ్రూప్ మ్యాచ్లో ఇండియా ఇంగ్లాండ్తో తలపడింది. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ తుఫాను బ్యాటింగ్ చేసి అందరినీ ఉర్రూతలూగించాడు. డర్బన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో 6…
Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ఆల్ టైమ్ భారత వన్డే జట్టును ప్రకటించారు. దీనికి సారథిగా మహేంద్ర సింగ్ ధోనినీ ఎంచుకున్నారు. అయితే, ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు ఇవ్వలేదు.