వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ది వస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా..? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా..? ఇలాంటి రాజకీయ నేరస్తులను.. తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని కామెంట్ చేశారు..
విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.. వారి కష్టాలు వర్ణనాతీతం.. వారి మాటలు విటుంటే నాలుగురోజుల నుండి వాళ్లు ఎంత నరకం అనుభవించారో అర్థమవుతుంది.. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు.. రోజుల తరబడి మంచి నీళ్లు కూడా అందలేదు అన్నారు..
అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కరకట్ట దగ్గర అవుట్ స్లూయుజ్ గండిని పూడ్చడానికి జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 11.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి వస్తుంది. ఇది కృష్ణానది చరిత్రలోనే అతి ఎక్కువ ఫ్లడ్ అన్నారు..
Botsa Satyanarayana: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ వెళ్లారు. అయితే, అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని ఎమ్మెల్సీ బొత్స నారాయణ అన్నారు.
Perni Nani: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మాజీ మంత్రి పేర్ని నాని కారు పైన కోడిగుడ్లతో దాడి జరిగింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో జడ్పీటీసీలకు ఆఫర్ల మీద ఆఫర్లు….. బంపరాఫర్లు తగులుతున్నాయా? మీ పంట పండింది పోండి… ఇక పండగ చేస్కోండి… మంచి తరుణం మించిన దొరకదంటూ వాళ్ళని ఉద్దేశించి ఎందుకు అంటున్నారు? అసలు కడప జిల్లా పరిషత్లో ఏం జరుగుతోంది? జడ్పీటీసీలకు ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయి? ఖాళీ అయిన కడప జిల్లా పరిషత్ చైర్మన్ సీటు దక్కించుకునేందుకు అటు టిడిపి ఇటు వైసీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జడ్పీలో టిడిపికి బలం లేకున్నా…వలసల్ని నమ్ముకుని రాజకీయం చేయాలనుకుంటున్నట్టు…
గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎన్ని రోజులు కావాలని అడిగారు. సీరియస్గా తీసుకోకపోతే ఇదో అలవాటుగా మారిపోతుందన్నారు.
గతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో మహిళల రక్షణ చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీకి ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారా? ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రిజైన్ చేయగా ఇంకో ఇద్దరు అదే రూట్లో ఉన్నారన్నది నిజమేనా? ఈ రాజీనామాల పరంపరపై పార్టీ అధిష్టానం వైఖరి ఎలా ఉంది? వెళ్ళే వాళ్ళని ఆపే ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా? లేక పోతేపోనీ అనుకుంటున్నారా? జంపింగ్స్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? రెండు నెలల క్రితం వరకు ఏపీలో తిరుగులేని ఆధిపత్యంతో రాజకీయం చేసిన వైసీపీకి ప్రస్తుతం వరుసబెట్టి సమ్మెట…
10 మంది రాజ్యసభ సభ్యులు బయటకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం అవాస్తవమని వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఒకరిద్దరు బయటకి వెళ్లినా మాకు నష్టం లేదన్నారు. మిగిలిన వాళ్లం పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడి పని చేస్తామన్నారు.