పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి హామీని మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేర్చిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. గత ప్రభుత్వంలా మానిఫెస్టోను పక్కన పెట్ట లేదు అని ఆయన అన్నారు.
ఈ నెల 21 నుంచి కుల గణన ప్రారంభం అవుతుంది అని సమాచార శాఖ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి కుల గణన ప్రక్రియ పూర్తి అవుతుంది.. సచివాలయ వ్యవస్థ ఉండటం వల్ల సర్వే ప్రక్రియ తొందరగా పూర్తి అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయంతో బీసీ వర్గ వ్యక్తిగా చాలా ఆనందంగా ఉంది అని మంత్రి అన్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు ఎందుకు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చేసే వాళ్ళం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉండే వాళ్ళం.. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..
Ambati Rayudu Hails Yuvatha-Haritha programme in AP: సాంస్కృతిక రాజధాని రాజమండ్రి నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని, అద్భుత నగరంగా ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యువత-హరిత’ కార్యక్రమానికి రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమండ్రి తిలక్ రోడ్లో నూతనంగా నిర్మించిన డివైడర్లలో ఎంపీ భరత్తో కలిసి…
CBI EX JD Lakshminarayana Tweet Goes Viral: తాజాగా శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే. తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లగా.. అక్కడే పర్యటిస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని కలిశారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేను సీబీఐ మాజీ జేడీ ఆహ్వానించారు. అదే సమయంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రోగ్రాం జరుగుతుండగా అందులో…
BJP Leader Vishnu Kumar Raju Fires on YCP MP Vijaysai Reddy: జనసేన-టీడీపీ కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రాకుండా పార్టీలన్నీ కలవాలని, రాక్షస రాజ్యం నుంచి సుపరిపాలనకు ప్రజలు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు అసలు బుద్ది ఉందా? అని విష్ణుకుమార్ రాజు…
YCP MP Gorantla Madhav react on His Comments on Nara Chandrababu: తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందని, పద దోషంతో నారా చంద్రబాబు నాయుడుపై ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారన్నదే తన ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ఎంపీ గోరంట్ల ఏంటి ఇలా అనేశారు? అని జనాలు మాట్లాడుకునేలా ఆయన వ్యాఖ్యలు…
జగన్ మోహన్ రెడ్డికి భయం అంటే ఏంటో చూపిస్తాను అని లోకేష్ అన్నాడు.. జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదు అని ఆయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి భయపడే టైపు కాదు.. దేశాన్ని శాసించిన సోనియాగాంధీని లెక్కచేయని మగాడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
సామాజిక సాధికారత పేరిట వైసీపీ నేటి నుంచి బస్సు యాత్రను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత జవహర్ మాట్లాడుతూ.. సామాజిక బస్సు యాత్రలో కోడి కత్తి శ్రీను ఫోటో పెట్టాలన్నారు. మరో ప్రక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం ఫోటో ఉంచాలన్నారు. breaking news, latest news, telugu news, tdp jawahar, ycp