టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక రాజకీయాల నుంచి వైదొలగాని ఏపీ దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ సలహా ఇచ్చారు. అనేక రోగాలు ఉన్నట్టు అయన తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.. ఆయనకు ఇప్పటికీ కేసు నుంచి విముక్తి కలగలేదు.. టీడీపీ- జనసేన పొత్తు కుదిరినా వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని మంత్రి ఆరోపించారు. హాథిరామ్ మఠానికి చెందిన మహంత్ అర్జున్ దాస్ ను తొలగిస్తూ ధార్మిక పరిషత్ నిర్ణయించింది.. ఆయనపై 16 అభియోగాలు రుజువు అయ్యాయని కొట్టు సత్యనారాయణ అన్నారు.
Read Also: NCERT: చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠ్యాంశాలు.. NCERT కీలక సిఫార్సులు..
త్రిమెన్ కమిటీ ఇచ్చిన నివేదిక సిఫార్సు మేరకు అర్జున్ మహంత్ ను తొలగిస్తూ ధార్మిక పరిషత్ ఏకగ్రీంగా నిర్ణయం తీసుకుంది అని మంత్రి కొట్ట సత్యనారాయణ అన్నారు. ఆయన స్థానంలో రమేష్ నాయుడు అనే వ్యక్తిని మఠం బాధ్యులుగా నియమించాము.. ఏపీపీఎస్సీ ద్వారా 59 మంది గ్రేడ్ 3 ఈవోల నియామకం చేపట్టాం.. 54 మందికి ఆలాట్ మెంట్ కూడా ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. 539 కోట్ల రూపాయల సీజీఎఫ్ నిధులతో దేవాలయాల పునరుద్దరణ చేస్తున్నాం.. కొత్త వాటిని నిర్మిస్తున్నాం.. త్వరలో రాష్ట్రంలోని 8 వేల దేవాలయాలకు ధూప దీప నైవేథ్య పథకం కింద 5 వేల రూపాయలు ఇస్తామని ఏపీ దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.