Kuna Ravi Kumar: బీసీలు బాగుపడితే.. సీఎం జగన్కు కడుపు మంట: రవికుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో బీసీలు బాగుపడితే సీఎం వైఎస్ జగన్కు కడుపు మంట అని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోందిని.. దళితులను, బీసీలను అవమానించే యాత్ర జరుగుతుందన్నారు. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారంపై ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పోస్టులు పెట్టించారని రవికుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో పేరుకే బీసీ మంత్రులు ఉన్నా పెత్తనం అంతా రెడ్లదే అని పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో కూన రవికుమార్ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో సీఎం జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది. దళితులను , బీసీలను అవమానించే యాత్ర జరుగుతుంది. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారంపై ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పోస్టులు పెట్టించారు. ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు పెట్టిన వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని, గౌతు శిరీష, పంచుమర్తి అనురాధలు పొలీసులకు పిర్యాధు చేస్తే పట్టించుకునే వారు లేరు. బీసీ మహిళలను అవమానించి రోతపుట్టించే రాతలు రాయించి.. నా బీసీలు అని మాట్లాడటానికి సిగ్గుందా?. పేరుకే బీసీ మంత్రులు.. పెత్తనం అంతా రెడ్లదే?. జిల్లాలను సామంత రాజులుగా రెడ్లు పంచుకున్నారు. బొత్స, ధర్మాన, సీదిరి, తమ్మినేని రెడ్ల బూట్లు నాకడానికి తాపత్రయ పడుతున్నారు’ అని అన్నారు.
Also Read
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
Also Read: TDP-Vellampalli Srinivasa Rao: 3న చర్చకు సిద్ధమంటూ.. వెలంపల్లి సవాలును స్వీకరించిన టీడీపీ!
‘మా హయాంలో 74 మంది బీసీలు, దళితులు 28 మంది ఉన్నారు. రజక, యాదవ, నాయిబ్రాహ్మన, మత్స్యకార, గీత కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం. మత్స్యకార పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసాం. టీటీడీ చైర్మెన్లుగా బీసీలకు పెద్ద పీట వేసింది టీడీపీనే. వైసీపీ రెడ్డిలను మాత్రమే టీటీడీ చైర్మెన్ చేసింది. అన్ని పధకాలలో అవినీతి చేసి వేసిన ఎంగిలి మెతుకలకు బీసీలు అశపడాలా?. ధర్మాన, బొత్స, తమ్మినేని నిజమైన బీసీలు కాదు. ఉత్తరాంధ్ర మంత్రులంతా బూర్జువా మంత్రులు. 12 యూనివర్సిటీలలో తొమ్మిది మంది వీసీలు రెడ్లేనా?. బీసీలకు వెన్ను దన్నుగా ఉన్నారనే చంద్రబాబుపై కుట్ర చేసి అక్రమ కేసులు పెట్టారు. బీసీలు బాగుపడితే జగన్కు కడుపు మంట. బీసీల అత్మాభిమానం తాకట్టు పెడుతున్న వారిని బవిష్యత్ క్షమించదు’ అని రవికుమార్ పేర్కొన్నారు.
- Tags
- ap
- Kuna Ravi Kumar
- tdp
- ycp
- ys jagan
తాజావార్తలు
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!