నిన్న జరిగిన ప్రపంచ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్లో అతను భారత అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత అభిమానులు ఆఫ్ఘనిస్థాన్కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. అంతేకాకుండా 'ఢిల్లీ ప్రజలు మంచి హృదయం కలవారని.. స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులందరు తమకు…
వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచింది.
2023 వన్డే ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చారిత్రాత్మక వికెట్ తీశాడు. తొలి ఓవర్ తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ క్యాచ్ పట్టాడు. ఈ వికెట్తో ట్రెంట్ బౌల్ట్ వరల్డ్ కప్ మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్గా నిలిచాడు.
రేపు(శనివారం) అహ్మదాబాద్లో భారత్-పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ 2023లో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ భారత్-పాకిస్థాన్ విజయం సాధించాయి. అయితే రేపటి మ్యాచ్లో వాతావరణం గురించి మాట్లాడితే మ్యాచ్పై ఎలాంటి ప్రభావం చూపదు. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం లేదు.
2023వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఆశించినంత ప్రదర్శన చూపించడం లేదు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం ఫామ్పై పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ఆజం మరోసారి ఫ్లాప్ అయ్యాడని అన్నాడు. బాబర్ ఆజం విఫలమైనప్పటికీ.. మంచి ఫాంలో ఉన్న ఆటగాడు మరొకరు దొరికాడని తెలిపాడు.
2023 వన్డే ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి ఈ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తో టీమిండియా.. వన్డే ప్రపంచకప్లో వరుసగా ఎనిమిదో విజయం కోసం ఎదురుచూస్తుంది.
వన్డే వరల్డ్ కప్-2023 లో భాగంగా ఈరోజు సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాను బ్యాటింగ్ కు పంపింది. ఈ మ్యాచ్ లో డికాక్ మరో సెంచరీ బాదాడు.
వరల్డ్ కప్ 2023 ప్రారంభంకు ముందే టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో జట్టు ఆడిన రెండు మ్యాచ్లకు అతను దూరమ్యాడు. అయితే అప్పటి నుంచి చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందగా.. తాజాగా కోలుకున్నాడు. దీంతో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఆడనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం గిల్ నెట్స్ లో అడుగుపెట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
2023 వరల్డ్ కప్ ప్రారంభం నుంచే టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ మ్యాచ్ లకు దూరమయ్యాడన్న సంగతి తెలిసిందే. డెంగ్యూ బారిన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మరొకరు డెంగ్యూ బారిన పడ్డాడు. భారతీయ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే డెంగ్యూ బారిన పడ్డారు. అయితే అక్టోబర్ 14న అహ్మదాబాద్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్కు హర్ష దూరం కానున్నాడు.