సెప్టెంబర్ 30 వ తేదీన పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేశారు. బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటిగ్ జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12 రౌండ్లు ముగిసే సరికి మమతా బెనర్జీ 35 వేల ఓట్ల మేజారిటీని…
భవానీపూర్ ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ తరపున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, బీజేపీ నుంచి ప్రియాంక బరిలో ఉన్నారు. అయితే, ఇది ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కావడంతో అమె విజయం నల్లేరుపై నడకే అయినప్పటికీ, బీజేపీ గట్టి పోటి ఇవ్వనుందని సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక జరిగే సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మధ్య జరిగిన…
భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ.. కీలక ఎన్నిక ఎదుర్కోబోతున్నారు. నందిగ్రామ్లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడినప్పటికీ.. మమతా బెనర్జీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆరునెలల్లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఇందుకోసం భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో మమత పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో…
సెప్టెంబర్ 30న జరగనున్న భవానీపూర్ ఉప ఎన్నికను నిలిపివేయడానికి నిరాకరించింది కలకత్తా హైకోర్టు.. ఈ ఉప ఎన్నిక విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ ఉపఎన్నికల ప్రక్రియపై భారత ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్ మరియు జస్టిస్ రాజర్షి భరద్వాజ్ లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా, మే 9న జరిగిన…
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత కూడా పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కొందరు నేతలు.. టీఎంసీ విజయం సాధించి.. మరోసారి మమతా బెనర్జీ సీఎం అయిన తర్వాత తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అందులో ఒకరు ఎమ్మెల్యే ముఖుల్ రాయ్.. అయితే.. బీజేపీ టికెట్పై గెలిచి టీఎంసీలో చేరిన ఎమ్మెల్యే ముఖుల్ రాయ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత,…
ప్రస్తుతం ప్రధాని మోడి అమెరికా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈరోజు అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, వచ్చేనెల 6,7 తేదీల్లో ఇటలీలో ప్రపంచ శాంతి సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం లభించింది. అయితే, ఆ సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్రం ఆమెకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో మమతా బెనర్జీ మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడి ఎక్కడికైనా…
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత తృణమూల్ నుంచి వచ్చిన కొంతమంది నేతలు తిరిగి ఆ పార్టీలో చేరిపోయారు. తాజాగా మాజీకేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా తృణమూల్లో చేరడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ను తప్పించి ఆ స్థానంలో ఎంపీ సుకంత మజుందర్ను నియమించింది. వెస్ట్ బెంగాల్ చీఫ్ నుంచి పక్కకు తప్పుకున్న దిలీప్ ఘోష్కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా…
పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ కు ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే, భవానీ పూర్ నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్నారు. కొన్నినెలల క్రితం జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సిట్టింగ్ స్థానం భవానీ పూర్…
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మరోసారి టీఎంసీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. వరుసగా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీకి గుడ్బై చెప్పి.. మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.. దీంతో.. నష్టనివారణ చర్యలు చేపట్టింది బీజేపీ అధిష్టానం.. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్గా ఉన్న దిలీప్ ఘోష్పై వేటు వేసింది.. ఆయన స్థానంలో ఎంపీ సుకంత మజుందర్ను నియమించింది. కాగా, బెంగాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీని…