ఈ నెల 15న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తన వాతావరణ బులెటిన్లో పేర్కొంది.
ఉత్తర వాయువ్య దిశ నుంచి పొడి గాలులు వీస్తుండటంతో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నారు. రాత్రికిరాత్రే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి రానున్న మూడు రోజుల పాటు పగటిపూట వేడిగాలులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్తర భారత దేశాన్ని గత వారంపాటు గజగజ వణికించిన చలి ఇప్పుడు దక్షిణ భారత దేశం వైపు వణికించేందుకు వచ్చేస్తోంది. దీని వల్ల తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి పూట పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదవుతుంది. తూర్పు ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున.. నేడు, రేపు మధ్యాహ్నం పొడివాతావరణ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నేటి నుంచి రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఎక్కడా వర్షాలు కురిసే సూచనలు లేవని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి మరో రెండు రోజుల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పయనించే ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.