Telangana Heavy rain: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Heavy rain: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి మరో రెండు రోజుల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పయనించే ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. దీంతో తెలంగాణలో సైతం నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే.. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం.. క్రమంగా బలపడుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం నేడు, రేపు (గురు, శుక్ర) రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Read also: Madhya Pradesh: మటన్ కోసం మొగుడు పెళ్లాల గొడవ.. మధ్యలోకి వెళ్లిన వ్యక్తి మర్డర్
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
నిన్న రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఓ లారీ వరద నీటిలో చిక్కుకుపోయింది…పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షానికి సర్వీసు రోడ్డుపై వరద నీరు పోటెత్తింది… ఓ లారీ డ్రైవర్ అర్ధరాత్రి ఔటర్ జంక్షన్ వద్దకు చేరుకున్నాడు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తీసుకొని వాహనాన్ని ముందుకు దూకించాడు. దీంతో లారీ ఆ నీటిలో చిక్కుకుంది. వాహనంలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వెంటనే వారు 100 కు ఫోన్ చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, తాళ్లసాయంతో ముగ్గురినీ బయటకు లాగారు. ఇక..సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్. మండలం రామన్నగూడెం శివారులో పిడుగుపాటుకు మల్లయ్య అనే రైతు.. అతడి రెండు గేదెలు మృతిచెందాయి. వర్షాలకు కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతోంది…జూరాలకు 1.48 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలానికి 2.74 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 1.64 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే… కృష్ణాలో ఎగువన ఆల్మట్టికి 20 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక..గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 77 వేల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 99 వేల క్యూసెక్కులు, తుపాకులగూడెం బ్యారేజీకి 2.52 లక్షలు, దుమ్ముగూడెంలోకి 2.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.
Corona: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్.. యమా డేంజరట!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!