Telangana Heavy rain: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు
Telangana Heavy rain: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి మరో రెండు రోజుల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పయనించే ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. దీంతో తెలంగాణలో సైతం నేడు, రేపు (గురు, శుక్ర)వారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే.. ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ 22న ఉదయానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం.. క్రమంగా బలపడుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం నేడు, రేపు (గురు, శుక్ర) రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Read also: Madhya Pradesh: మటన్ కోసం మొగుడు పెళ్లాల గొడవ.. మధ్యలోకి వెళ్లిన వ్యక్తి మర్డర్
Also Read
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
నిన్న రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఓ లారీ వరద నీటిలో చిక్కుకుపోయింది…పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షానికి సర్వీసు రోడ్డుపై వరద నీరు పోటెత్తింది… ఓ లారీ డ్రైవర్ అర్ధరాత్రి ఔటర్ జంక్షన్ వద్దకు చేరుకున్నాడు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తీసుకొని వాహనాన్ని ముందుకు దూకించాడు. దీంతో లారీ ఆ నీటిలో చిక్కుకుంది. వాహనంలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వెంటనే వారు 100 కు ఫోన్ చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, తాళ్లసాయంతో ముగ్గురినీ బయటకు లాగారు. ఇక..సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్. మండలం రామన్నగూడెం శివారులో పిడుగుపాటుకు మల్లయ్య అనే రైతు.. అతడి రెండు గేదెలు మృతిచెందాయి. వర్షాలకు కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతోంది…జూరాలకు 1.48 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలానికి 2.74 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్కు 1.64 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే… కృష్ణాలో ఎగువన ఆల్మట్టికి 20 వేల క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక..గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 77 వేల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 99 వేల క్యూసెక్కులు, తుపాకులగూడెం బ్యారేజీకి 2.52 లక్షలు, దుమ్ముగూడెంలోకి 2.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది.
Corona: మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్.. యమా డేంజరట!
తాజావార్తలు
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!