కరోనా తరువాత విశాఖలో విమానయాన రంగం సేవలు క్రమంగా పుంజుకుంటున్నాయి. స్పైస్ జెట్, స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయి. జనవరి 1 నుంచి విశాఖ-తిరుపతి, కోల్కతా-విశాఖ స్పైస్ జెట్ విమానాలు నడవబోతున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 29 నుంచి విశాఖ-సింగపూర్ మధ్య స్కూట్ ఎయిర్ సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. Read: నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన… దీనికి సంబంధించిన టికెట్ల విక్రయాలను విమానయాన సంస్థలు ప్రారంభించింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ సర్వీసులను…
విశాఖ జిల్లాలో నాలుగు థియేటర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు అధికారులు. టిక్కెట్ ధరలు పెంచినట్టు గుర్తించడంతో యాజమాన్యాలను వివరణ కోరింది యంత్రంగం. ఈ రకమైన ఫిర్యాదులు తొమ్మిది సినిమాహాళ్లపై రావడంతో… థియేటర్ల నిర్వహణ, టిక్కెట్ ధరలు,లైసెన్సులపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. అయితే సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు…
ఉత్తరాంధ్రలో జవాద్ తుఫాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత…
విశాఖ నగరంలో మహాదీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్నో చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చూసినా కుదరలేదని, పరమేశ్వరుడు విశాఖలోనే ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించారని స్వామి స్వరూపనందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. వేదం ఇంకా బతికి ఉందంటే అది శ్రీ వేంకటేశ్వర స్వామి మహిమే అని, వేదాన్ని పోషిస్తోంది ఒక తిరుమల తిరుపతి వెంకన్న మాత్రమే అని అన్నారు. Read: వీడు మాములోడు కాదు…విమానం ల్యాండింగ్ గేర్లో దాక్కొని… జీవితంలో ఒక్కసారైనా శ్రీవేంకటేశ్వర స్వామిని…
దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల జాతరలు జరుగుతుంటాయి. పట్టణాలు, నగరాల్లో జరిగే జాతరల గురించి మనకు తెలుసు. అయితే, కొన్ని రకాల జాతరలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలా కూడా జారతలు నిర్వహిస్తారా అని ఆశ్చర్యపోతుంటాం. విశాఖ జిల్లాలోని రాంబిల్లి మండల్లోని దిమిలి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో గ్రామ దేవత దల్లమాంబ అనువు మహోత్సవాన్ని గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. రేపు మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 10 గంటల…
లెక్కలు తారుమారు అవుతున్నాయా? ఎన్నిక ఎన్నికకూ ఈక్వేషన్స్ మారుతున్నాయా? రేస్లో ముందున్నవారు.. తాజా లెక్కలతో తారుమారు అవుతారా? ఓటు బ్యాంక్ కోసం.. అధిష్ఠానం అదే ఊపులో వెళ్తే అమాత్య పదవిపై ఆశలుపెట్టుకున్న వారికి నిరాశ తప్పదా? ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారిన సమీకరణాలు..! విశాఖజిల్లా అధికారపార్టీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. స్ధానిక సంస్ధల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వైసీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సామాజిక న్యాయం ప్రధానాంశంగా ఇక్కడ పదవుల పంపకం చేస్తోంది…
రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అన్నారు జగన్. ఈ సిటీలో రోడ్లు వున్నాయి. కరెంట్, అన్ని రకాల వసతులు వున్నాయి. సుందరీకరణపై శ్రద్ధ పెడితే విశాఖ హైదరాబాద్ తో పోటీపడుతుందన్నారు. మూడురాజధానుల విషయలో జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. పాత చట్టం తీసేసి కొత్త చట్టంతో వస్తామన్నదానికి అర్థం పర్థం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. సీఎం జగన్ నిర్ణయాలతో జనానికి తీరని లోటని తప్పుబట్టారు. వికేంద్రీకరణ…
విశాఖలో ఇద్దరూ మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. విశాఖ ఎస్పీ కృష్ణారావు ఎదుట మహిళా మావోయి స్టులు తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలు సరెండర్ అయ్యారు. వీరిరువూరు పలు ఘటనలలో, నేరాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెద బయలు దళానికి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు అనేక నేరాల్లో పాల్గొన్నారని తెలిపారు. అనారోగ్య కారణాలతో పాటు ప్రజల నుంచి మావోయిస్టులకు ఆదరణ లభించకపోవడంతో లొంగిపోయారన్నారు. ఇద్దరు…
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు కేటు గాళ్లు.. లారీలు, కార్లు, ఆటోలు, టూ విలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి.. కేజీలు, క్విటాళ్ల కొద్ది గంజాయి దొరికిన సందర్భాలు లేకపోలేదు. అయితే, స్మగ్లర్లు రూట్ మార్చారు.. ఆధునిక యుగంలో అంతా ఆన్లైన్ అయిపోయింది.. ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారమ్స్ను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు గంజాయి విక్రయాలు…