టీమిండియా అభిమానులకు భారీ షాక్. భారత జట్టు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భార్య ఆర్తి అహ్లావత్తో 20 ఏళ్ల వైవాహిక బంధానికి వీరూ స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్లు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆర్యవీర్ (2007), వేదాంత్ (2010)…