Fame Turns to Jail: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో రెచ్చిపోయిన ఇద్దరు యువకులు కటకటాల పాలయ్యేలా చేసింది. ఇంస్టాగ్రామ్లో వీడియోలు చేసేందుకు పోలీస్ స్టేషన్నే టార్గెట్ చేసి.. హింసాత్మక డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
VC Sajjanar : సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పరిస్థితి పెరుగుతోంది. తాజాగా ఇలాంటి సంఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. వైరల్ వీడియోలో ఒక యువకుడు రైలు పట్టాలపై పడుకొని, తనపై నుంచి రైలు పోతుండగా వీడియో తీయించుకొని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్, సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి యువతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పిచ్చికి పరాకాష్ట..…
Padma Shri Garikapati Narasimha Rao: మహా సహస్రావధాని, ఆధ్యాత్మిక వేత్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా.. ఆయన అవధానాలు వినే ఉంటారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన ఇచ్చే సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా యువత గరికపాటి సందేశాలను బాగా ఇష్టపడతారు. ప్రస్తుత సమాజానికి తగ్గట్టు మాట్లాడటం, ఏదేని విషయాన్ని కుండ బద్ధుల గొట్టినట్లు వివరించడం యువతను కట్టి పడేస్తుంది.
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్కి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా? సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలు అనుమానాలకు తావిస్తున్నాయి. వారం రోజులు అయిపోయిన సన్నీ జాడలేదు. అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించకపోయినా.. రహస్య ప్రదేశంలో విచారిస్తూ.. కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తు్న్నారంటే సన్నీ వెనకు పెద్ద కుట్ర దాగి ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈసారి ప్రయోగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే, అఘోరీలు, నాగ సాధులు, రుషులతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అయితే, ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పేరు ‘మోనాలిసా’. ఆమె…
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం సమీపంలోని ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో మద్యం సేవిస్తున్న మందు బాబులు విద్యార్థులతో ఘర్షణకు దిగిన ఘటన కలకలం రేపుతోంది. వసతి గృహ సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్టు గమనించిన విద్యార్థులు, ఇక్కడ మద్యం సేవించడం మంచిది కాదని వారిని హెచ్చరించారు. విద్యార్థులు చేసిన పనిని సీరియస్ గా తీసుకున్న మందు బాబులు మద్యం మత్తులో వసతి గృహంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత…
New Year Celebrations: 2025 సంవత్సరంలోకి ప్రపంచ దేశాలు అడుగు పెట్టాయి. నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రజలు కేక్ కట్ చేస్తూ ఆనందంగా గడిపారు. చాలామంది భక్తులు దేవాలయాలను సందర్శించడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. పుణ్యస్నానాలు చేస్తూ, గడ్డకట్టే చలిని పట్టించుకోకుండా తెల్లవారు…
Pawan Kalyan: ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఒదిగి ఉండే తత్వం కొంత మందికే ఉంటుంది. అలాంటి వ్యక్తుల లిస్ట్ లో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినా, తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత కూడా ఎక్కడా అతనికి గర్వం తలకెక్కలేదని స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, బయటివారు కూడా ప్రశంసిస్తారు. టాలీవుడ్లో పవర్ స్టార్గా స్టార్…
మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ఢిల్లీ మెట్రోకు చెందిన వీడియోలైతే.. తరచూ చర్చలో ఉంటాయి. ఇటీవల వైరల్ అయిన వీడియోలో.. ఒక అమ్మాయి చిరిగిన దుస్తులతో మెట్రోలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. ఇప్పుడు మరో మెట్రోకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కానీ ఈ వీడియో ఢిల్లీ మెట్రోకు సంబంధించింది కాదు.