Bayya Sunny Yadav : భయ్యా సన్నీ యాదవ్కి ఉగ్రవాదులతో లింకులు.? బయటపడ్డ కీలక విషయాలు..!
- సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలు
- వారం రోజులు అయిపోయిన సన్నీ జాడలేదు
- అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ ప్రకటించలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్కి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయా? సోషల్ మీడియాలో లీక్ అవుతున్న వీడియోలు అనుమానాలకు తావిస్తున్నాయి. వారం రోజులు అయిపోయిన సన్నీ జాడలేదు. అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించకపోయినా.. రహస్య ప్రదేశంలో విచారిస్తూ.. కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తు్న్నారంటే సన్నీ వెనకు పెద్ద కుట్ర దాగి ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
READ MORE: Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?
Also Read
ఇటీవల బైక్ రైడ్ చేస్తూ పాకిస్థాన్కు వెళ్లడంతో భయ్యా సన్నీయాదవ్ పై ఎన్ఐఏ నజర్ పెట్టింది. ఇప్పటికే జ్యోతి మల్హోత్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఉగ్రవాదులతో పరిచయాలు ఉన్నట్లు తేలింది. భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్థాన్కి వెళ్లడం వెనుక.. జ్యోతి తరహాలో ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ నుంచి దుబాయ్కి చేరుకున్న సన్నీ, అక్కడి నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకోగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఎన్ఐఏ అధికారికంగా ధృవీకరించలేదు. చెన్నైలోని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో కలిసి విచారిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఎలాంటి పరిచయాలు ఉన్నాయి. కేవలం.. పాకిస్థాన్కు ఎలా వెళ్లాలనే అంశంపై ఆమెను కాంటాక్ట్ అయ్యాడా? లేదా జ్యోతి చెప్పడం వల్లే పాక్కు వెళ్లాడా? అనేది తేలాల్సి ఉంది.
READ MORE: IPL 2025 Final RCB: ఫైనల్ ముందు ఆర్సీబీ బలాబలాలు ఇవే.. టైటిల్ సాధించడానికి సరిపోతాయా..?
ఓ సారి పాక్కు వెళ్లేందుకు అటెంట్ చేసి ఫెయిల్ అయ్యాడు. రెండోసారి ఎందుకు తీవ్రంగా ప్రయత్నించాడు? పట్టుబట్టి మని పాక్కు వెళ్లాల్సిన అవసరం ఏంటి? అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. భయ్యా సన్నీ కేవలం రైడ్ కోసమే పాకిస్థాన్కు వెళ్లి ఉంటే.. అక్కడ సమావేశాలు ఎందుకు జరిపాడు అనేది హాట్ టాపిక్గా మారింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో సన్నీ యాదవ్కి పక్కనే ఉన్న వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో అక్కడ ఎవరెవరిని ఎందుకు కలిశాడనే అంశంపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. పహల్గాం ఘటన జరిగినప్పుడు, భారత్ పాక్పై డ్రోన్లతో దాడులు చేస్తున్నప్పుడు భయ్యా సన్నీ పాక్లోనే ఉన్నాడు. ఇది కూడా అనుమానాలు తావిస్తోంది. అతడి తండ్రి మాత్రం తన కొడుకును ఎవరు తీసుకెళ్లారో తెలియదని, తనకు ఎలాంటి సమాచారం లేదంటున్నాడు. కోర్టును ఆశ్రయిస్తాడని తెలిపాడు.
తాజావార్తలు
-
Peddi : “బడ్జెట్ హద్దులు దాటలేదు”.. ‘పెద్ది’పై క్లారిటీ ఇచ్చిన బుచ్చిబాబు!
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..