Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. కేరళను తప్పుగా చూపించారనే వివాదం నేపథ్యంలో నిన్న కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ స్టే విధించారు. అయితే, ఈ రోజు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ సినిమా విడుదలకు అనుమతి ఇచ్చింది. తీర్పు వెలువడిన తర్వాత, సినమా నిర్మాతలు ముంబైలో సాయంత్రం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఈ రోజు రాత్రి విడుదల అవుతుందని వెల్లడించారు.
'ది కశ్మీర్ ఫైల్స్' పంథాలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' మూవీ సైతం వివాదలలో చిక్కుకుంటోంది. ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్' చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న నాలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ తో సహా కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.