గుంటూరు జిల్లాలోని, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో టిడిఆర్ బాండ్ ల పేరుతో భారీ అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. 10 కోట్ల రూపాయల అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. రోడ్ల విస్తరణ పేరుతో, ఈ టిడిఆర్ బాండ్ల అక్రమాలు జరిగాయని, విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. కొన్ని చోట్ల రోడ్ డెవలప్మెంట్ ప్లానింగ్ లేకుండానే, టిడిఆర్ బాండ్లు విడుదల చేశారని, డోర్ నెంబర్లు మార్చి, తక్కువ ధర పలికే స్థలానికి కూడా ఎక్కువ దరలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారని, విజిలెన్స్…
Komatireddy Venkat Reddy : పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న ఎషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ ఛైర్మన్ డా. డి నాగేశ్వర్ రెడ్డిని సన్మానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వారందరికి గర్వకారణమన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వారు చేసినంత పరిశోధనలు, ఆవిష్కరణలు మరో డాక్టర్ చేసి ఉండరంటే…
Civil Supply Corruption : వనపర్తి జిల్లాలో సివిల్ సప్లై అవినీతి అక్రమాలపై చీఫ్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు . సియం ఆర్ ధాన్యం మాయం, నిర్మాణాలు పూర్తి కాని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు . డిఫాల్ట్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులపై మూడు రోజులుగా విచారణ కొనసాగుతోంది . జిల్లాలో పనిచేస్తున్న సివిల్ సప్లై అధికారి , పౌర సరఫరాల శాఖ మేనేజర్, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి లను హైదరాబాద్ లోని…
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు జిల్లా పోలీసులు. 60 లక్షల విలువ చేసే నాలుగున్నర క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని, ఆరుగురి అరెస్ట్ చేశారు. కర్ణాటక నుండి తెలంగాణకు తీసుకోవచ్చి నకిలీ పత్తి విత్తనాలను రైతులకు అమ్ముతున్నారు. కాగా జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరంతా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులుగా.. మీడియా సమావేశంలో ఎస్పీ భాస్కరన్ వివరాలు వెల్లడించారు.