వందే భారత్ ట్రైన్స్ రవాణా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. హై స్పీడ్ తో దూసుకెళ్తూ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తున్నాయి. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్ చైర్ కార్ ట్రైన్స్ పరుగులు తీస్తున్నాయి. అయితే రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు భారతీయ రైల్వే రెడీ అయ్యింది. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఈ రూట్ లో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. Also…
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్.. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లలో.. ప్రయాణీకుల కోసం వేడి నీటిని సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. అయితే ఎప్పటికప్పడు రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం కొత్త కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణీకులకు ఈ సేవలు ఉచితంగా అందించనుంది.…