రంగారెడ్డి జిల్లా ఆదిభట్లకు చెందిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నవీన్రెడ్డి సోదరుడు నందీప్రెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. నవీన్రెడ్డి, వైశాలి వీడియోలు సర్క్యులేట్ చేశారని, గోవాలో నవీన్రెడ్డి వీడియోలను రికార్డు చేసి మీడియాకు పంపారనే పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావడంతో నందీప్రెడ్డి, వంశీభరత్రెడ్డిలను అదుపులో తీసుకున్నారు.
తెలంగాణ సంచలనం రేకెత్తించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆదిభట్ల పోలీసులు.. గోవాలోని కాండోలిమ్ బీచ్ వద్ద నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. అతడిని గోవా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇక, అతని దగ్గర ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.. ఈ నెల 9న వైశాలి ఇంటిపై నవీన్రెడ్డి, అతని స్నేహితులు దాడికి పాల్పడ్డారు. అప్పటి నుంచి నవీన్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అయితే, వైశాలికి అమెరికా పెళ్లి సంబంధం…
రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రంగారెడ్డి నడిబొడ్డున ఓ యువతి సినిమా తరహాలో కిడ్నాప్ చేసి పోలీసులకు నిర్వాకం సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఎలాంటి భయం లేకుండా రోజూ సుమారు 100 మంది యువకులతో వెళ్లి ఇంట్లో ఓ యువతిని కిడ్నాప్ చేశాడు. అయితే నవీన్ వైశాలి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.