NATO: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(NATO) సైనిక కూటమి నుంచి అమెరికా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మమీడియాతో మాట్లాడుతూ.. నాటో నుంచి బయటకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నాటో ఒక ‘‘పేపర్ పులి’’గా మారిందని అన్నారు. నాటో విశ్వసనీయత గురించి తనకు ముందు నుంచి అనుమానాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు.
Iran Warns US: ఇరాన్ యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమ భూభాగంపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు చెందిన ప్రధాన టెక్నాలజీ, పారిశ్రామిక కంపెనీలపై అటాక్ చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించినట్లు ప్రభుత్వ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. Read Also: Hyderabad Serial Killer : వృద్ధురాళ్లే టార్గెట్.. కారులో…
US-Iran War: ఇరాన్ ఒక ఒప్పందాన్ని అంగీకరించాలని లేదా యుద్ధం తీవ్రమవుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మంగళవారం హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందానికి రావానే విషయంలో అమెరికా దృఢంగా ఉందని ఆయన అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని,
Donald Trump: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మరోసారి యూకే, నాటో మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్రిటన్, ఫ్రాన్స్లకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా యుద్ధ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇజ్రాయిల్ వైపు వెళ్తున్న తమ విమానాలకు ఫ్రాన్స్ అనుమతి నిరాకరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా, మిత్ర దేశం యూకే వైఖరిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.
మధ్యప్రాచ్యం యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా ఇరాన్లోని ఇస్ఫాహాన్లో 2,000 పౌండ్ల బంకర్-బస్టర్ బాంబును అమెరికా పేల్చింది. ఇరాన్లోని ప్రధాన నగరమైన ఇస్ఫహాన్లోని ముఖ్యమైన ఆయుధాగారంపై సుమారు 907 కిలోగ్రాముల బరువైన బంకర్-బస్టర్ బాంబులతో దాడి చేసింది.
Pakistan: ఇరాన్ యుద్ధం ఆపేందుకు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా పనిచేస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్తో సహా ఈజిప్ట్, టర్కీ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్కు వెళ్లారు. వీరికి పాకిస్తాన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
Stock market: అమెరికా-ఇరాన్ యుద్ధం తగ్గే పరిస్థితులు లేకపోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ ఎఫెక్ట్ భారతీయ స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్దం తీవ్రత పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. గత వారం కేవలం 4 రోజుల్లోనే పెట్టుబడిదారులు సుమారుగా రూ. 1.75 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
Iran Strikes Kuwait: ఇరాన్ రెచ్చిపోయి దాడులు చేస్తోంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా కువైట్లోని షువైఖ్ పోర్టులో ఆరు అమెరికన్ ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీలపై దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికన్ బలగాలను హతమార్చినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. 1000 కి.మీ పరిధిలో కలిగిన ఖాదర్ 380 క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి దాడులు జరిపినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
Iran War: ఇరాన్ను చావు దెబ్బతీయడానికి అమెరికా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరినా ఇరాన్ ఇంకా లొంగిపోలేదు. అమెరికా, ఇజ్రాయిల్కు ఎదురు నిలిచి దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు చేస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా బేస్లు, కీలక చమురు సదుపాయాలపై దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్ను తుది దెబ్బ తీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు ఉన్నాయి. 1) మొదటిది…
ఇరాన్ యుద్ధాన్ని దూకుడుగా మొదలుపెట్టిన అమెరికా.. చివరకు వెనకడుగు వేసింది. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల వ్యవధిలో.. ట్రంప్ ఎందుకు వాయిదా పద్ధతిని ఎంచుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పనిచేశాయా..? సొంత దేశంలో వ్యతిరేకత భయపెట్టిందా..? ఇప్పుడు ఇరాన్ ఎందుకు మొండికేస్తోంది..? ఇరాన్కు బేషరతుగా లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని హుంకరించిన ట్రంప్.. చివరకు దాడులకు విరామం ఇచ్చారు. హర్మూజ్ను 48 గంటల్లో తెరవాలని డెడ్లైన్ పెట్టి.. ఆ గడువు ముగియక ముందే.. అబౌట్…