Home
Ttd
Ttd News
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్…
మంత్రి సత్యవతి రాథోడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… క్రిష్ణా జలాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాం. కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో….ఈ అంశం కోర్టుకి వెళ్లింది. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చినా స్పందించలేదు అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితో అయిన పోరాటం చేస్తారు కేసిఆర్ అని చెప్పిన మంత్రి హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం అన్నారు. ఇక ఇదిలా ఉంటె ఈరోజు తిరుమల… -
గోరంట్లను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్న టీడీపీ…
రాజమండ్రిలో గోరంట్ల నివాసానికి పార్టీ అధిష్టానం నుంచి త్రిసభ్య బృందం చేరుకుంది. అధిష్టానం బృందంలో విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీమంత్రులు చినరాజప్ప జవహార్ తదితరులు ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది టీడీపీ అధిష్టానం. రాజీనామా యోచన విషయంలో ఉన్న గోరంట్ల ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దాంతో గోరంట్ల నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అనుచరులు. బుచ్చయ్య డిమాండ్లు పరిశీలనలోకి తీసుకుని, ఆదిరెడ్డి అప్పారావుతో… -
అక్టోబర్ 7 నుండి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణి మరమ్మతు పనులును చేపట్టింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హరతిని నెల రోజులు పాటు రద్దు చేసింది. ఇప్పటికే పనులు ప్రారంభించింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తెస్తారు.. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం మూలలో స్వామివారి పుష్కరిణి నెలకొని వుంటుంది. ముల్లోకాలలో వున్న అన్ని తీర్దాలు స్వామి పుష్కరిణిలో కలుస్తాయని ఆలయ పండితులు పేర్కొంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకున్నా.. అందులో స్నానం చేసిన సమస్త… -
తిరుమలలో శిలువ గుర్తు కలకలం…
తిరుమలలో శిలువ గుర్తు కలకలం రేపుతోంది. ఇండికా కారుపై శిలువ గుర్తును గమనించకుండా… తిరుమలకు అనుమతిచ్చారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. తనిఖీ సమయంలో కారును క్షుణంగా తనిఖీ చేయలేదు విజిలెన్స్ సిబ్బంది. అయితే కారు వెనుక అద్దంలో ”శిలువ గుర్తు., ave Maria’’ అనే అన్యమత శ్లోకంతో తిరుమలకు వచ్చింది కారు. వారు తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించిన తిరుమల విజిలెన్స్ సిబ్బంది అనంతరం శిలువ గుర్తును తొలగించి కారును భక్తులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు. అయితే… -
రుషికొండపై శ్రీవారి ఆలయాన్ని నిర్మించిన టీటీడీ
విశాఖ రుషికొండపై టీటీడీ నిర్మించిన ఈ ఆలయం ఏడు కొండలవాడి వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం.. ఇవన్నీ చూస్తే మరో తిరుమలలా అనిపిస్తుంది. భీమిలి బీచ్ రోడ్డును ఆనుకుని కొండపై 10 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించింది టీటీడీ. ఆలయ నిర్మాణం, ఘాట్ రోడ్డు, ఇతరత్రా సదుపాయాల నిమిత్తం సుమారు 28 కోట్లు నిధులు ఖర్చు చేసింది. ఇప్పుడీ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అచ్చం తిరుమల ఆలయం మాదిరే.. విశాఖలోనూ వేంకటేశ్వరుడి… -
నేడు టిటిడి చైర్మన్ గా భాధ్యతలు చేపట్టనున్న వైవి సుబ్బారెడ్డి
ఇటీవలే టిటిడి చైర్మన్ పదవి బాధ్యతలను.. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి జగన్ సర్కార్ అప్పగించిన సంగతి తెలిసిందే. మొన్నటి నామినేటెడ్ పదవుల్లో భాగంగా… వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ టిటిడి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు వైవి సుబ్బారెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో… -
శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమలకు టీటీడీ చైర్మన్…
ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్గా నియమించింది. 2019లో తొలిసారి టీటీడీ చైర్మన్గా పదవీబాధ్యతలు చేపట్టిని వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. చైర్మన్ను మారుస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం సుబ్బారెడ్డి వైపే మొగ్గుచూపింది. రెండోసారి పదవిని చేపట్టిన తరువాత ఆయన శ్రీవారి మెట్టుమార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. గత రెండేళ్లలో తెలియక దోషాలు జరిగి ఉంటే తొలగిపోవాలని కోరుకుంటూ కాలినకడన శ్రీవారి మెట్టు… -
భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతా : వైవి సుబ్బారెడ్డి
టీటీడీ బోర్డు చైర్మన్ గా మరోసారి తనకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు వైవి సుబ్బారెడ్డి. తాజాగా ఎన్టీవీతో మాట్లాడినా ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు. నాకు మరోసారి చ్చినందుకు సంతోషిస్తున్న. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే. భవిష్యత్ లో ప్రత్యక్ష రాజకీయాలలో కొనసాగుతా.. టీటీడీలో గతంలో… -
మరోసారి చైర్మన్గా అవకాశం.. సీఎం జగన్కు థ్యాంక్స్ చెప్పిన బాబాయ్
టీటీడీ బోర్డు చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్… దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే అదృష్టం అందరికి రాదు.. నాకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. బోర్డు చైర్మన్ పదవి తీసుకోవడంలో నాకు అసంతృప్తి లేదన్నారు. ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమే.. కానీ, భవిష్యత్… -
మరోసారి టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి…
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమించింది. ఛైర్మన్ పదవీకాలం రెండేళ్లు. రెండేళ్ల తరువాత వైవీ సుబ్బారెడ్డిని మారుస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, వాటిక్ చెక్ పెడుతూ ఏపీ ప్రభుత్వం మరోసారి వైవీని టీటీడీ ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి అవకాశం ఇవ్వడం పట్ల వైవీ సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి…
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!