Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ కలెక్టర్ తీరు వివాదాస్పదమైంది. ట్రకర్ల నిరసన నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యన్ చేసిన ‘ఔకత్’ (స్థాయి) వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ట్రక్కర్ల ప్రతినిధిని ఉద్దేశిస్తూ ‘నీ స్థాయి ఎంత’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ని పదవి నుంచి తొలగించింది బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదని సీఎం మోహన్ యాదవ్ అన్నారు.
హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్లతో స్థానిక కలెక్టర్ వ్యవహరించిన తీరు వివాదాస్పాదమైంది. ఈ నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్ను తొలగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు.
Hit-And-Run Law: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన హిట్-అండ్-రన్ చట్టంపై దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళనలకు పిలుపునిచ్చారు. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. మరోవైపు సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు బంకుల ముందు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిన్న ట్రక్ సంఘాలతో సమావేశం నిర్వహించింది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రావడంతో ట్రక్కర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Truckers Strike: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ‘హిట్ అండ్ రన్’ చట్టంపై ట్రక్కులు, బస్సు, లారీలు, ట్యాంకర్ల డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కేసుల్లో ఎక్కువ కాలం శిక్షతో పాటు జరిమానా భారీగా ఉండటాన్ని వారు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తు్న్నారు. పలు నగరాల్లో రోడ్లపై ఆందోళనలు చేశారు. అయితే డ్రైవర్ల సమ్మె వల్ల సామాన్య ప్రజానీకంలో భయాలు మొదలయ్యాయి. ఆందోళన నేపథ్యంలో ట్యాంకర్ల డ్రైవర్లు కూడా విధులకు రాకపోవడంతో పెట్రోల్ కొరత ఏర్పడుతుందని భయపడుతున్నారు.
Hit-and-Run law: కేంద్రం తీసుకువచ్చిన కొత్త ‘‘హిట్ అండ్ రన్’’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కులు, ట్యాంకర్లు, లారీలు, బస్సుల డ్రైవర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజల్ని పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టేలా చేసింది. సోమవారం నుంచి ట్రక్కర్లు ఆందోళన బాటపట్టారు.
Truckers Protest: కేంద్రం తీసుకువచ్చిన కొత్త హిట్-అండ్-రన్ చట్టంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ట్రక్కు, బస్సు, ట్యాంకర్ ఆపరేటర్లు ఆందోళనలు చేపట్టారు. సోమవారం నుంచి ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు ట్రక్కు డ్రైవర్ల ఆందోళలతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల మందు వాహనదారులు క్యూ కట్టారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Hit-And-Run Law: కేంద్రం తీసుకువచ్చిన కొత్త హిట్-అండ్-రన్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు నిరసన తెలుపుతున్నారు. త్వరలో అమలు చేయబోతున్న క్రిమినల్ కోడ్కి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునివ్వడంతో ఇది మిగతా వాహనదారుల్లో భయాలను పెంచుతున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇలాగే నిరసనలు కొనసాగితే నిత్యావసరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.