మన దక్షిణాది తారలు హిందీ చిత్రాలలో మెరవడం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లోనే హిందీ సినిమాల్లో మన యన్టీఆర్ మూడు సినిమాల్లోనూ, ఏయన్నార్ ఓ చిత్రంలోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇక వైజయంతి మాల, పద్మిని, అంజలీదేవి, సావిత్రి, జమున, బి.సరోజాదేవి, రాజశ్రీ, గీతాంజలి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లు సైతం హిందీ సినిమాల్లో తమ ఉనికిని చాటుకున్నారు. తమిళ నటుడు జెమినీ గణేశన్ కూడా కొన్ని హిందీ చిత్రాలలో అలరించారు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ప్రళయం సృషించాయి. ఆర్థిక నష్టాన్నే కాద్దు హార్ధిక నష్టాన్ని కూడా కలగజేశాయి. అయితే ఇంత జరిగినా చిత్ర ప్రముఖులు ఎవరూ సాయం చేయలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి కూడా. అయితే ముందుగా అల్లు అరవింద్ తమ గీతా ఆర్ట్స్ తరపున రూ. 10 లక్షలను విరాళంగా ప్రకటించారు. నిజానికి టాలీవుడ్ ప్రముఖులు ఇలాంటి విపత్తులు వచ్చినపుడు ఒకరికొకరు పోటాపోటీగా స్పందించేవారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అరవింద్ తర్వాత…
సినిమా తారల ప్రచారంతో పబ్బం గడుపుకోవచ్చుననే సంస్థలు బోలెడున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు మన తెలుగు సినిమా తారలు సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తూ, బాగానే వెనకేసుకుంటున్నారు. ఇది జగద్విదితం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ర్యాపిడో’ బైక్స్ ప్రచార చిత్రంలో నటించేసి టి.ఎస్.ఆర్.టి.సి. ఎమ్.డి సజ్జనార్ నుండి నోటీసులు అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘ర్యాపిడో బైక్ యాడ్’లో టి.ఎస్.ఆర్.టి.సి.ని కించపరిచే విధంగా…
ప్రముఖ సీనియర్ నటుడు నటుడు కోటా శ్రీనివాస్ రావు తెలుగు హీరోలు, తాజాగా జరుగుతున్న ‘మా’ కాంట్రవర్సీపై స్పందించారు. స్టార్ హీరోలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “మా తెలుగు హీరోలు తమ సినిమాల కోసం చాలా కాస్ట్యూమ్స్ మార్చుకుంటూ ఉంటారు. కానీ వారికి ఇంకా జ్ఞానం రాలేదు. వారు ప్రతిసారీ తెలివితక్కువగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్క హీరో కూడా చేతిలో మైక్ పట్టుకుని సరిగ్గా మాట్లాడలేడు” అంటూ ఫైర్ అయ్యారు. Read Also :…