యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. విడుదల తేదీని దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఇష్యూ ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం.. ఈ విషయమై చిత్ర పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ విషయంపై నాచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. “ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తుంది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఏపీ ప్రభుత్వం…
2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయాక ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు. ఇద్దరు పలు ప్రాజెక్టలలో తలమునకలవుతూ తిరుగుతున్నారు. సమంత కనీసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండగా .. చైతూ ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తరువాత వీరిద్దరూ ఇటీవల కలిశారు. అయితే అది కేవలం షూటింగ్ నిమిత్తం మాత్రమే. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద ఆఖరి షెడ్యూల్, చై నటిస్తున్న బంగార్రాజు ఆఖరి…
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా అడుగుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. ఈ చిత్రంతో టాలీవుడ్ లో సత్తా ఉన్న కుర్ర హీరో అనిపించుకున్న నవీన్ ఆ తరువాత జాతి రత్నాలు చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత నవీన్ పెద్ద బ్యానర్ లోనే పడ్డాడు. ఎప్పటినుంచో నవీన్ , అనుష్క శెట్టి జంటగా ఒక సినిమా రాబోతున్నదని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం…
దన్నుగా ధనమెంతో ఉన్నా మన్నువాసన తెలిసినవాడు కాబట్టి మట్టి మనుషుల పక్షాన నిలచి వారి కోసం గళమెత్తినవాడు దర్శకనిర్మాత,రచయిత,నటుడు బి.నరసింగరావు. బూజుపట్టిన నిజామురాజు పాలనలోనే భూస్వాములుగా ఉన్న నరసింగరావు పెద్దలు, మొదటి నుంచీ అణగారిన జనం బాగు కోసం పాటు పడ్డారు. తన చిత్రాలతో జనాన్ని మెప్పించడంలోనే కాదు, ప్రభుత్వ అవార్డులూ, రివార్డులూ పట్టేసి అలరించారు నరసింగరావు. మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో 1946 డిసెంబర్ 26న నరసింగరావు జన్మించారు. ధనానికి కొదువలేని ఇంట్లో జన్మించడం వల్ల…
నగుమోము నగ్మా తన నగిషీల మహిమతో తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతోమంది రసికాగ్రేసరుల కలల సామ్రాజ్యానికి రాణిగా పట్టాభిషిక్తురాలయింది. నాజుకు సోకులతో అలరించడమే కాదు, బరువు పెరిగినా దరువు వేస్తూ సక్సెస్ రూటులో సాగిపోయింది నగ్మా. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, భోజ్ పురి, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ నగ్మా తనదైన బాణీ పలికించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. నగ్మా అసలు పేరు…
టాలీవుడ్ లో అందరు ఎదురుచూసే కాంబో .. పవన్ కళ్యాణ్- మహేష్ బాబు. ఫ్యాన్స్ వార్ అని హీరోల ఫ్యాన్స్ కొట్టుకుంటున్నా వీరి మధ్య స్నేహ బంధం మాత్రం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. పవన్- మహేష్ ల మధ్య ఉన్న స్నేహ బంధానికి నిదర్శనమే .. ప్రతి ఏడాది క్రిస్టమస్ కి పవన్, మహేష్ ఇంటికి పంపే కానుకలే. ప్రతియేటా పవన్ తన తోటలో పండిన మామిడి పండ్లను మహేష్ కుటుంబానికి పంపిస్తుంటారు. ఇక క్రిస్టమస్ వచ్చిందంటే…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆహా లో ఎంతటి రచ్చ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద డైరెక్టర్లు, కుర్ర హీరోలు అని లేకుండా అందరితోను బాలయ్య పంచ్ లు, జోకులు, వారితో ఆటలు ఆడించడం, వారి చేత కొత్త సీక్రెట్లు బయటపెట్టించడం .. అబ్బో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో డైమండ్. ఇక ఇప్పటికే 5 ఎపిసోడ్లు అద్భుతంగా పూర్తిచేసుకున్న ఈ టాక్ షో 6 వ ఎపిసోడ్ కి సిద్ధమైంది.…