Lyricist Gurucharan Passed Away: టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హైదరాబాద్ రహమత్ నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గురుచరణ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకి భార్య పద్మ, కుమారుడు రవికిరణ్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పటి ప్రముఖ నటి ఎంఆర్ తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల…
“మళ్ళీ కూయవే గువ్వా…మోగిన అందెలమువ్వ… తుళ్ళి పాడవే పువ్వా… గుండెల సవ్వడి మువ్వా…” – ఈ పాట అప్పట్లో కుర్ర కారు గుండెలను మీటింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లోని ఈ పాటతోనే గీత రచయిత కందికొండ యాదగిరి చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే తన కవితాశోభను జనానికి పరిచయం చేయగలిగారు కందికొండ. దర్శకుడు పూరి, సంగీత దర్శకుడు చక్రి సైతం ఆయనలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ అదే చిత్రంలో “నీకోసం వేచి వేచి…
సరసాలు పోయిన కలం… నవరసాలు పలికించిన కలం… నీరసాలను దూరం చేసిన కలం… ‘నవ’రసాలను ఊరించిన కలం… ఆ కలం పేరు వేటూరి సుందర రామమూర్తి! పండిత వంశంలో జన్మించిన వేటూర సుందరరాముడు చిత్రసీమలో తనదైన కవితావైభవాన్ని ప్రదర్శించారు. మహాపండితుడు, అన్నమయ్య పదకవితలను లోకానికి తెలియజేయడానికి పూనుకున్న ఘనుడు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆయన సోదరుని తనయుడే వేటూరి సుందర రామమూర్తి. వేటూరి వారింట తలుపును తట్టినా కవిత్వం పలుకుతుందని ప్రతీతి. అలాంటి వంశంలో పుట్టిన కారణంగా…