Home
Tirupati News
Tirupati News News
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
ACB Raids: తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో భారీగా బంగారం, వెండి గుర్తించినట్లు సమాచారం. ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనలో 1.7 కేజీలకు పైగా బంగారం, 8.6 కేజీలకు పైగా వెండి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎస్టీవీ నగర్లోని ఎస్బీఐ బ్యాంకులో ఉన్న లాకర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లాకర్ను తెరిచి పరిశీలించేందుకు బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. లాకర్లోని వస్తువుల వివరాలను కూడా అధికారులు పరిశీలించనున్నారు. అదేవిధంగా లోకనాథానికి… -
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
Tirupati Crime: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన 21 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. అరిగెలవారిపల్లెకు చెందిన షాలిని.. పనపాకం హరిజనవాడకు చెందిన ఎస్.చందును ఎనిమిదో తరగతి నుంచి ప్రేమించినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు షాలినిని బెంగళూరుకు పంపించినా.. చందు అక్కడికీ వెళ్లి ఆమెను కలుస్తూ వచ్చాడని సమాచారం. గతంలో షాలిని మైనర్గా ఉన్న సమయంలో ఆమెకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా.. చందు… -
Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
Love Couple Attacked: ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులపై నడిరోడ్డుపై దాడి జరగడం తిరుపతిలో కలకలం రేపింది. రక్షణ కల్పించాలని కోరుతూ తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలోనే యువతి కుటుంబ సభ్యులు వారిని అడ్డగించి దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో యువతి మెడలోని తాళిబొట్టును తెంచడంతో పాటు యువకుడు చందుపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. భయాందోళనలకు గురైన నవ దంపతులు సమీపంలోని ఓ కార్యాలయంలోకి పరుగెత్తి ఆశ్రయం పొందారు. స్థానికుల… -
Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
Leopard: తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత కనిపించడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గాలిగోపురాన్ని దాటిన అనంతరం నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. చిరుతను చూసిన భక్తులు పెద్దగా అరవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తుల అరుపులు, రద్దీ కారణంగా చిరుత సమీప అడవిలోకి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం… -
Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Peddireddy Ramachandra Reddy: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతిలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి, మావిగన్ ప్రాజెక్టు, ఎన్నికల ప్రక్రియతో పాటు పలు అంశాలపై స్పందించారు. ముఖ్యంగా మావిగన్ ప్రాజెక్టు వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పెద్దిరెడ్డి అన్నారు. మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా… -
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
Seshachalam Forest : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని శేషాచల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగర శివార్లలోని జీవకోన అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే అడవి అంతటా విస్తరిస్తున్నాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అడవిలోని విలువైన వృక్షసంపద అగ్నికి ఆహుతవుతోంది. గత కొద్ది రోజులుగా తిరుపతిలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో, ఎండుగడ్డి రాపిడి వల్ల లేదా వేడి సెగలకు ఈ మంటలు అంటుకొని ఉంటాయని భావిస్తున్నారు. మంటల కారణంగా అడవి… -
Prakash Raj Faces Defamation Suit: ప్రకాష్ రాజ్కు షాక్.. వంద కోట్ల పరువు నష్టం దావా..!
Prakash Raj Faces Defamation Suit: శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు సినీ నటుడు ప్రకాష్ రాజ్.. అయితే, వీహెచ్పీ, బీజేపీ, హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్పై తీవ్రస్థాయిలో మండిపుతున్నారు.. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులపై ఆయన చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీరాముడు,… -
Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..
తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతి ఒక అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా వేసవి కాలంలో ఎండ వేడిమితో అల్లాడిపోయే భక్తులకు, శ్రీవారి సన్నిధిలో అనూహ్యంగా మారిన వాతావరణం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. మార్చి నెలలో మండుటెండలు ఉండాల్సిన సమయంలో, తిరుమల కొండలను దట్టమైన మంచు కమ్మేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శ్రీవారి ఆలయ పరిసరాల నుంచి మొదలుకొని కొండపైకి వచ్చే ఘాట్ రోడ్డు మార్గం వరకు అంతా మంచుమయంగా మారిపోయింది. ఈ అద్భుత వాతావరణం కారణంగా తిరుమల గిరులు… -
War Effect in Tirupati : తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్.. రేపటి నుండి కమర్షియల్ గ్యాస్ సరఫరా బంద్..!
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం భవిష్యత్తులో గృహ వినియోగదారులకు ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతో, నగరంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. రేపటి నుండి తిరుపతి నగరవ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వ , ప్రైవేటు గ్యాస్ కంపెనీలు సంయుక్తంగా నిశ్చయించుకున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపార వర్గాల్లోనూ, ఇటు శ్రీవారి… -
Kavitha Announces New Political Party: తిరుమలకు కాలినడకన కవిత.. కొత్త పార్టీపై కీలక ప్రకటన..
Kavitha Announces New Political Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె.. ముందుగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. గత నాలుగేళ్లుగా చేయని తప్పుకు తాను మానసిక వేదన అనుభవించానని కవిత తెలిపారు. అయితే దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసిందని చెప్పారు. ఆ కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!