కరోనా సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం “తిమ్మరుసు”. జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రంలో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మజీ, రవి బాబు, అంకిత్, అజయ్ తదితరులు నటించారు. సంగీతం శ్రీచరన్ పాకాల అందించారు. శరణ్ కొప్పిసెట్టి దర్శకత్వం వహించారు. “తిమ్మరుసు”ను ఈస్ట్ కోస్ట్…