తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి ఆశాభంగమే ఎదురైంది. వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న వారికి తక్షణ ఉపశమనం లభించకపోగా.. ప్రభుత్వం పీఆర్సీ (Pay Revision Commission) గడువును మళ్లీ పొడిగించింది. అసలు ఈ కమిటీ గడువు మార్చి 31తో ముగియాల్సి ఉండగా.. తాజాగా దాన్ని సెప్టెంబర్ చివరి వరకు ఆరు నెలలు పెంచే నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వేతనాల అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులు కొత్త పీఆర్సీ…