Bhatti Vikramarka: రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థుల భవిష్యత్త్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ నెల 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. గత పది నెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సర్కార్ ముందుకు దూసుకెళ్తుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున.. ఈ నెల 14 వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ప్రభుత్వా విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీలు, బలరాం నాయక్, కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని అన్నారు.
తెలంగాణలో కులగణన సర్వేతో అంతా తెలిపోతుందా ? కులగణన తేలిపోయాక...స్థానిక సంస్థల ఎన్నికల వరకే అమలు చేస్తారా ? రాజకీయంగా ఆయా వర్గాలకు అవకాశాలు అంది వస్తాయా ? జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ సీట్లు కేటాయిస్తారా ? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్గా మారింది.
డీఎస్పీ (DSP)గా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు స్వీకరించారు.
దశాబ్దాల నిరీక్షణకు తెర పడింది. మూడు దశాబ్దాలుగా ప్రమోషన్ కోసం వేచి చూస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి కల్పించనుంది రాష్ట్ర సర్కార్. జీవో 134 ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. కాగా.. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రమోషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.. ఈరోజు హైడ్రాకు సంబంధించి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు.. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అనంతరం ఆర్డినెన్సు పై సంతకం కోసం రాజ్ భవన్కి ఫైల్ పంపించిన ప్రభుత్వం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్సు పై సంతకం చేశారు.
Hydra Team: మూసీ నివాసితుల ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూసీ ప్రక్షాళనలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మూసీ వద్ద ఆక్రమణలు తొలగించిన వెంటనే సుందరీకరణ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ రోజు నాలుగో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా.. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ అంశంపై చర్చించారు.
TG Govt Stop Cellars: బహుళ అంతస్తుల వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సెల్లార్లపై ఫిర్యాదులు, వర్షపునీటి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.