ఏపీలో ట్వీట్ల వార్ తో పాటు కొత్త వివాదాలు తెరమీదకు వచ్చాయి. ట్వీట్లతో వైసీపీ-టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే.. తాజాగా జూమ్ మీటింగ్ లలో అధికార పార్టీ నేతలు చొచ్చుకురావడంపై వివాదం రేగింది. దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. టీడీపీ జూమ్ కాన్ఫరెన్సులో వైసీపీ నేతలు జొరబడ్డ ఎపిసోడుపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగులోకి మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే వంశీ సహా వైసీపీ నేతలు జొరబడడంపై సీఐడీ చీఫ్…