యూకే ప్రధాని రిషి సునాక్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ పార్టీ 300 సీట్లకు పైగా గెలుచుకున్నట్లు ట్రెండ్లు చూపించగా.. సునాక్ కన్జర్వేటివ్ పార్టీ 61 స్థానాల్లో ముందంజలో ఉంది.
గోళ అద్భుతాలను చూసేందుకు అందరూ ఇష్టపడతారు. కానీ గ్రహశకలాలు భూమి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు అందదు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా అఫోసిస్ అనే గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. దీని పరిమాణం 370 మీటర్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ముఖం మీద మొటిమలు, మచ్చలు ఏర్పడితే ఎవరికి ఇష్టం ఉంటుంది. కానీ చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు మొటిమల కారణంగా ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ముఖంపై మొటిమలు రావడం సహజమే అయినా వీటి వల్ల ముఖ సౌందర్యం పాడవుతుంది.
కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో మొహబ్బత్ దీప్ సింగ్ చీమా కూడా ఒకరు. ఉద్యోగం పోవడంతో దీప్ సింగ్ చీమా(36) తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి తన సొంత రాష్ట్రం పంజాబ్కు తిరిగి వచ్చాడు. ధిల్వాన్లో తన సొంత ఫుడ్ ట్రక్ 'ది పిజ్జా ఫ్యాక్టరీ'ని స్థాపించడానికి ఇదే మొదటి అడుగు అని కూడా అతనికి తెలియదు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో బుధవారం ఆస్తానాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులపై భారత్ ఆందోళనలను లేవనెత్తారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి చేశారు . యుద్ధం నేపథ్యంలో భారతీయుల సమస్యపై లావ్రోవ్తో లేవనెత్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.
తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
కే.కేశవరావును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఉన్న ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని' అని అన్నారు. ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.