KCR: సోయిలేని తనంతోనే మొదటి నుంచి తెలంగాణ ఆగం.. ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితుల వివరణ
- సోయిలేని తనంతోనే మొదటినుంచీ తెలంగాణ ఆగం- కేసీఆర్
- కవి గోరెటీతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను వివరించిన కేసీఆర్
- తమ హక్కులను కాపాడుకునే దిశగా ఎప్పటికప్పుడు..
- తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలి- కేసీఆర్.
తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉద్దేశపూరిత ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వ చైతన్య రాహిత్యం రైతాంగానికి తీరని శాపంగా మారిందని, అటువంటి సంక్లిష్ట పరిస్థిలోంచి తెలంగాణ సమస్యలను అర్థం చేసుకొని కవులు కళాకారులు మేధావుల సాహిత్య సాంస్కృతిక ప్రక్రియ ఒకవైపు టిఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ మరోవైపు జమిలిగా సాగి భావజాల వ్యాప్తి చేస్తూ ప్రజలకు అర్థం చేయించి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించగలిగామని కేసీఆర్ వివరించారు.
Kalki 2898 AD: విజయ్ ను అలా చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన కల్కి టీమ్
Also Read
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
స్వరాష్ట్ర సాధన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన నష్టాలను సరిదిద్దుకుంటూ.. ఒక్కొక్కటిగా సవరించుకుంటూ తెలంగాణ అస్తిత్వ గరిమను నిలుపుకుంటూ దేశానికే ఆదర్శవంతమైన ప్రగతిని అందించడానికి పదేండ్ల పాలనాకాలాన్ని ప్రణాళికా బద్ధంగా సద్వినియోగం చేసుకున్నామన్నారు. ఎంతో సహనంతో దార్శనికతతో శాంతియుత పంథాలో చాతుర్యంతో ఉద్యమకాలం నుంచి నిన్నటిదాకా సాగిన రెండున్నర దశాబ్దాల ఈ మొత్తం ప్రక్రియను రాగద్వేషాలకు అతీతంగా తెలంగాణ ఆత్మతో లోతుగా అర్థం చేసుకుంటూ సూక్ష్మ దృష్టితో పరిశీలించినప్పుడు మాత్రమే బోధపడుతుందని కేసీఆర్ వివరించారు.
Amaravathi: అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు కేంద్ర మంత్రి గ్రీన్సిగ్నల్!
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రజా వాగ్గేయకారుడు ఎంఎల్సీ గోరేటి వెంకన్న గురువారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి కవిత్వ పుస్తకాలను కేసీఆర్ కి అందజేశారు. అనంతరం సాగిన ఇష్టాగోష్టి సమావేశంలో తెలంగాణ సాహిత్యం సంస్కృతి రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రపంచ నాయకత్వానికి దీటుగా శాంతియుత పద్దతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందని, దేశానికే ఆదర్శంగా పదేండ్ల కేసీఆర్ పాలన సాగిందని గోరెటి వెంకన్న తనదైన సాహిత్య శైలిలో వివరించారు. అదే సందర్భంలో … సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన పిట్ట వాలిన చెట్టు’ పుస్తకాన్ని కేసీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వర్దెల్లిని అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులున్నారు.
తాజావార్తలు
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!