S Jaishankar: ఆమోదయోగ్యం కాదు.. రష్యన్ సైన్యంలో భారతీయులపై ఎస్ జైశంకర్
- రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో ఎస్ జైశంకర్ భేటీ
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న పౌరులపై భారత్ ఆందోళన
- వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో బుధవారం ఆస్తానాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులపై భారత్ ఆందోళనలను లేవనెత్తారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి చేశారు . యుద్ధం నేపథ్యంలో భారతీయుల సమస్యపై లావ్రోవ్తో లేవనెత్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. అనేక మంది భారతీయులు రష్యా సైన్యంలో సేవలందించారని ఆయన తెలిపారు. భారత పౌరులు వేరే దేశానికి చెందిన సైన్యంలో సేవలు అందించడం ఆమోదయోద్యం కాదన్నారు. నివేదికల ప్రకారం, రష్యా సైన్యంలో దాదాపు 200 మంది భారతీయులు భద్రతా సహాయకులుగా నియమించబడ్డారు. యుద్ధ ప్రాంతంలో కనీసం నలుగురు భారతీయులు మరణించారు.
Read Also: Uttarakhand: మైనర్ జంట డేటింగ్కు వెళ్లడం నేరం కాదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉత్తరాఖండ్ హైకోర్టు
Also Read
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
ఆస్తానాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కలవడం ఆనందంగా ఉందని జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యం, సమకాలీన సమస్యలపై చర్చించామని ఆయన తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ( SCO ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి జైశంకర్ మంగళవారం కజకిస్తాన్ రాజధాని ఆస్తానాకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మాస్కో పర్యటనకు వెళ్లే కొద్ది రోజుల ముందు ఇద్దరు విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగింది. విదేశీ వ్యవహారాల మంత్రి కూడా గ్లోబల్ స్ట్రాటజిక్ ల్యాండ్స్కేప్ గురించి చర్చించారు. లావ్రోవ్తో అంచనాలు, అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు.
షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జైశంకర్.. రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్, కజకిస్తాన్లకు చెందిన నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా, శిఖరాగ్ర సమావేశానికి ఆస్తానాలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, హత్రాస్ దుర్ఘటనపై భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము,ప్రధాని నరేంద్ర మోడీకి సంతాప సందేశం పంపారు.
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!