Home
Telugu News
Telugu News News
-
Leopard: చిరుత మళ్లీ వచ్చింది.. పచ్చర్లలో మహిళ, తిరుమలలో చిన్నారిని చంపింది ఒక్కటే
గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని చిరుత చంపి తిన్న విషయం తెలిసిందే.. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అయితే.. భక్తులపై దాడికి పాల్పడటంతో అటవీ అధికారులు దానిని కొన్ని రోజులకు బంధించారు. అనంతరం.. నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. అయితే.. ఆ చిరుతే మళ్లీ మనుషులపై దాడి చేస్తుంది. పచ్చర్లలో మెహరున్నీసా అనే మహిళను చంపి తింది. కాగా.. ఈ చిరుతను తిరుమలలో చిన్నారిని చంపి తిన్న చిరుతగా… -
TSMDC : ప్రభుత్వ ఇసుక విధానంతో TSMDCకి రూ.6,461 కోట్ల ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం వల్ల తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎండీసీ) ఈ ఏడాది జూన్ వరకు రూ.6,461 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వినియోగదారులకు సరసమైన ధరకు సరిపడా ఇసుకను అందించాలనే లక్ష్యంతో 2014లో ఇసుక మైనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇసుక అక్రమ రవాణా , లోడింగ్ను తగ్గించడం కూడా ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల TSMDCకి మాత్రమే కాకుండా స్థానిక… -
Lavanya -Rajtarun : రాజ్తరుణ్ని వదిలే ప్రసక్తి లేదు
గంట గంటకో మలుపు తిరుగుతోంది రాజ్తరుణ్ – లావణ్యల వ్యవహారం. తనను రాజ్తరుణ్ మోసం చేసాడని, అన్నిరకాలుగా వాడుకొని వదిలేసాడని, తన దగ్గర డబ్బులు తీసుకొని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడు. మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్తరుణ్కు సంబంధం ఉంది. నన్ను అడ్డు తప్పించేందుకు డ్రగ్స్ కేసు తనపై పెట్టించాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్తరుణ్పై కేసు పెట్టింది లావణ్య అనే యువతి. ఈ వివాదం రేగిన కాసేపటికే హీరో రాజ్… -
Raj Tarun : ఎవరి ఆరోపణల్లో నిజమెంత…?
పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొంది పలువురు దర్శక – నిర్మాతల దృష్టిని ఆకర్షించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు రాజ్తరుణ్. అలా మొదటి చిత్రం విరించి వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ , సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం ద్వారా హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టి, వరుస అవకాశాలను అందిపుచ్చుకొని ఫుల్ బిజీ హీరో అయ్యాడు రాజ్తరుణ్. ఒక హిట్ రెండు ప్లాప్ లు అన్నట్టు సాగుతోంది కుర్ర… -
Bharat Gaurav :’భారత్ గౌరవ్’ అయోధ్య-కాశీ రైలు జూలై 9న సికింద్రాబాద్ నుండి ప్రారంభం
ప్రతిస్పందనతో ప్రోత్సహించబడిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్సిటిసి ) ‘ భారత్ గౌరవ్ ‘ టూరిస్ట్ రైలును పుణ్య క్షేత్ర యాత్ర అని పేరు పెట్టింది: సికింద్రాబాద్ నుండి అయోధ్య-కాశీ ప్రారంభమవుతుంది. ప్రత్యేక రైలు జూలై 9 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 9 రోజుల ప్రయాణం ప్రారంభమవుతుంది , గయా, వారణాసి, అయోధ్య , ప్రయాగ్రాజ్తో సహా అనేక పవిత్ర స్థలాలకు యాత్రికులను తీసుకువెళుతుంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లోని… -
Pawan Kalyan: పీసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష..
పీసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫ్యామిలీకి చెందిన కంపెనీల పర్యావరణ నిబంధనలపై ఆరా తీశారు. ద్వారంపూడి కుటుంబానికి చెందిన వీరభధ్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్లు పీసీబీ అధికారులు స్పష్టీకరణ చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లు గుర్తించారు. అనుమతుల ప్రకారం రోజుకి 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 56 టన్నులు ఉత్పతి చేస్తున్నారని పీసీబీ నివేదిక ఇచ్చింది. -
MLC Kavitha : సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్
తీహార్ జైలులో ఈ ఉదయం ఎమ్మెల్సీ కవిత తో ములాఖాత్ అయ్యారు కేటీఆర్ , హరీష్ రావు. సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీష్ చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ వేసే దాకా ఢిల్లీలోనే ఉండి… న్యాయవాదుల బృందంతో సమన్వయం చేయనున్నారు కేటీఆర్, హరీష్. ఢిల్లీ ఎక్సైజ్… -
Infant Mortality : 2023-24లో పెరిగిన శిశు మరణాలు
శిశు మరణాల నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో నవజాత శిశు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సంబంధిత అధికారులు అందించిన సమాచారం ప్రకారం, జిల్లాలో 2022లో 28 నవజాత శిశువులు , శిశు మరణాలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 56 నవజాత శిశువులు , శిశు మరణాలు నమోదయ్యాయి, ఇది 100 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఇది 2021లో 22 మంది, 2020లో 27 మంది, 2020లో 27 మంది, 2019లో 38 మంది నవజాత… -
Terrorist Died: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్ట్ మృతి..
పాకిస్థాన్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. 1981లో ఇండియన్ ఎయిర్లైన్స్ (ఐఏ) విమానాన్ని హైజాక్ చేసిన వాంటెడ్ టెర్రరిస్ట్ గజిందర్ సింగ్ (74) మరణించాడు. పాకిస్థాన్లోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. గజిందర్ సింగ్ ఒక పేరుమోసిన ఉగ్రవాది, అతను ఖలిస్తాన్ అనుకూల సంస్థ "దాల్ ఖల్సా" సహ వ్యవస్థాపకుడు. 1981లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ-423 హైజాక్లో ప్రధాన కుట్రదారుల్లో ఇతను ఒకడు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం హైజాక్కు గురై పాకిస్థాన్లోని… -
Nimmala Ramanaidu: ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది..
ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు.
తాజావార్తలు
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో