ఏపీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపైఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. అయితే.. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.
రూ.2 వేల నోట్ల మార్పిడి నేపథ్యంలో జరిగిన పరిణామాలు విశాఖపట్నంలో కలకలం రేపాయి. తనిఖీల్లో భారీగా సొమ్మును గుర్తించిన పోలీసు అధికారిణి భారీ మొత్తంలో నగదు కాజేసినట్లు విశాఖ సీపీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే.. మహిళ సీఐ చేతివాటంలో విస్తురపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన పరిధి కాకపోయిన అనధికార తనఖీలు చేపట్టడం..
ప్రధాని మోడీ ఈ నెల 8న ప్రధాని మోడీ వరంగల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ను పిఎంవో విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ. 8న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్…
ఈనెల 8 వతేదీన రాష్ట్రంలో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈనెల 8 న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై నేడు వరంగల్ పోలీస్ కమీషనర్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో
ఇటీవల టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. రేపు తెలంగాణ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (TSBSE) TS SSC సప్లిమెంటరీ పరీక్ష 2023ని 14 జూన్ నుండి 22 జూన్ 2023 వరకు నిర్వహించింది. మొత్తం 13.4శాతం మంది…
పార్టీ కోసం కమిట్ మెంట్ తో పని చేసే వ్యక్తి కిషన్ రెడ్డి అని, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపేందుకు కారణం కిషన్ రెడ్డి అని అన్నారు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నన్ను రారా పోరా అని పిలచేది కిషన్ రెడ్డి గారేనని, రాబోయే రోజుల్లో తెలంగాణ
దక్షిణాఫ్రికాలోని ఓ మురికివాడలో గ్యాస్ లీక్ కావడంతో పిల్లలతో సహా 16 మంది చనిపోయారు. కొంతమంది వ్యక్తులు ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన విపత్తు, అక్రమ మైనింగ్ కార్యకలాపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని సౌతాఫిక్రా అధికారులు వెల్లడించారు. జోహన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్ జిల్లా సమీపంలోని ఏంజెలో అనధికారిక సెటిల్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.