Home
Telugu News
Telugu News News
-
Chhattisgarh: ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టో కోసం బీజేపీ ప్యానెల్ ఏర్పాటు
ఛత్తీస్గఢ్లో 2018లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవడానికి ముందు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోను రూపొందించేందుకు 31 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసింది. -
Tamilnadu: గవర్నర్ తొలగించబడడానికి అర్హులు.. రాష్ట్రపతికి తమిళనాడు సీఎం లేఖ
తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య వివాదం ముదిరింది. గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఫిర్యాదు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. -
Taliban Rule: టైలరింగ్ నేర్చుకుంటున్న బాలికలు.. పాఠశాలలు తెరవాలని తాలిబన్లకు విజ్ఞప్తి
ఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. -
Shocking Video: రైలు కింద పడ్డ బతికి బట్టకట్టింది.. ఈ కుక్కకు నూకలున్నాయి..!
రైలు కింద పడిన తర్వాత మనిషి కానీ జంతువు కానీ బ్రతకడం చాలా కష్టం. అలాంటిది ఓ కుక్క రైలు కింద పడ్డ బతికి బట్ట కట్టింది. అంతం దగ్గరలో ఉన్నవాడిని విశ్వంలో ఏ శక్తీ రక్షించదు. అలాగని.. మరణం వ్రాయబడని వ్యక్తిని చంపగల శక్తి కూడ లేదు. కొన్నిసార్లు అదృష్టం కొద్దీ ఏదైనా ప్రమాదం నుంచి బయటపడుతారు. ఇప్పుడు కూడా ఈ కుక్క లక్కీగా ప్రాణాల నుంచి బయటపడింది. -
Man Kills Neighbours: పిల్లలను కనవా.. అని అడిగినందుకు సుత్తితో కొట్టి ముగ్గురిని చంపేశాడు..
పిల్లలను కనవా.. అని పదే పదే ఓ కుటుంబం ఓ వ్యక్తిని ప్రశ్నించింది. దీంతో విసుగుచెందిన ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ముగ్గురిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పంజాబ్లోని లూథియానాలోని సేలం తబ్రీ ప్రాంతంలో జరిగింది. -
Farming: గోమూత్రంతో పంటల సాగు.. పెరిగిన దిగుబడి..!
రసాయనిక ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయని చాలా మంది రైతులు భావిస్తున్నా ఆ పరిస్థితి లేదు. రైతు సోదరులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తేనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం ఆవు పేడ, వర్మీకంపోస్టును ఎరువుగా ఉపయోగించాలి. ఇప్పుడిప్పుడే రైతాంగం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసే పండ్లు మరియు కూరగాయల ధర కూడా చాలా ఎక్కువ. అంతేకాకుండా ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. -
Canada Open 2023 : ఒకరు ఓటమి.. మరొకరు ఫైనల్కు..!
కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ఫైనల్ కు చేరుకున్నాడు. జపాన్కు చెందిన కెంటా నిషిమోటోపై వరుస గేమ్లతో విజయం సాధించి ఈ ఘనత సాధించాడు. మరోవైపు ప్రపంచ నం.1 క్రీడాకారిణి అకానె యమగుచి సెమీఫైనల్లో పీవీ సింధును ఓడించింది. మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్స్లో జపాన్ నంబర్ వన్ అకానె యమగుచి చేతిలో 14-21, 15-21 తేడాతో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఓడిపోయింది. -
Shubman Gill: నేను వేసుకున్న షర్ట్ ను నువ్వు వేసుకున్నావ్.. ఏంది బ్రో..!
శనివారం వీరిద్దరూ స్టైల్ షర్టులు ధరించి ఓ హోటల్ కు లంచ్ చేయడానికి వెళ్లారు. వారిద్దరికీ ఇష్టమైన సుషీ డిష్ ను తింటూ.. కెమెరాకు ఫోజులు ఇస్తూ.. ఎంజాయ్ చేశారు. ఇదంతా ఒకవైపు ఐతే.. మరోవైపు ముంబయి ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పసిగట్టింది. లంచ్ చేస్తూ దిగిన ఫొటోలో ఇషాన్ కిషన్ ధరించిన షర్ట్ గతంలో శుభ్ మన్ గిల్ తన ప్యారిస్ ట్రిప్లో ధరించినట్టు గుర్తించారు. -
Vande Bharat Express: త్రివర్ణ పతాకం స్ఫూర్తితో వందేభారత్ కొత్త లుక్.. రైలులో చేసిన అప్గ్రేడ్లు ఇవే..
దేశంలో రైల్వేశాఖ ఒకదాని తర్వాత ఒకటిగా వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైల్వే ఫీడ్బ్యాక్ ప్రకారం వందేభారత్ రైళ్లలో మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు వందేభారత్ రైళ్లలో 25 మార్పులు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పేర్కొన్నారు. -
Viral Video: పామును తిన్న తాబేలు.. నమ్మలేకపోతున్నారా ఈ వీడియో చూడండి..!
తాబేలు పామును తినడం ఎప్పుడైనా చూసారా?. మాములగా ఐతే పాములు కప్పలు, పురుగులను తింటుంది. తాబేలు మాత్రం మట్టి, గడ్డి లాంటివి తింటూంటాయి. అయితే ఈ వీడియోలో తాబేలు పామును తింటుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!