నవరాత్రి పండుగ సందర్భంగా బాలికలు కచ్లోని హస్తకళలతో తయారు చేసిన చనియా-చోళీని ధరించి గర్బాను జరుపుకుంటున్నారు. అదే కళ, సంస్కృతి కారణంగా, కచ్లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్యసమితి నుంచి బిరుదును పొందింది.
వరల్డ్ కప్ 2023లో నాలుగింటిలో నాలుగు విజయాలు అందుకుని టీమిండియా జోరు మీదుంది. ఇక భారత్ తన 5వ మ్యాచ్ ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. అందుకోసం భారత్.. ధర్మశాలకు చేరుకుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్-భారత్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
కొచ్చి విడాకుల కేసులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు గురువారం మౌఖికంగా విమర్శిస్తూ.. మహిళలు తమ తల్లి, అత్తగారికి బానిసలు కాదని పేర్కొంది. మహిళ నిర్ణయాలు ఏ విధంగానూ తక్కువ కాదని జస్టిస్ దేవన్ రామచంద్రన్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తనపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ధృవీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అక్టోబరు నెలలో వేడి శీతాకాలం ప్రారంభమవుతుంది. పగటిపూట వేడిగా ఉంటే.. రాత్రి చల్లగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థలు పడుతూ.. వైద్యుల దగ్గరకు వెళ్లలేని స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఇంట్లోనే ఉంటే విశ్రాంతి వలన ఇవి నయం కావు. వాటికి కొన్ని నివారణ చర్యలు ఉన్నాయి. అవి పాటిస్తే వెంటనే జలుబు, దగ్గు తగ్గిపోతుంది.
అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రభుత్వం రోడ్మ్యాప్ను రూపొందించిందని, స్వదేశీయంగా నిర్మించిన అంతరిక్ష నౌకలో భారతీయుడు చంద్రునిపైకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.
డెంగ్యూ జ్వరం అంటే ఎంతో ప్రమాదకరమైనదో చెప్పనక్కర్లేదు. సీజన్ మారుతుందంటే ఇది తొందరగా విజృంభిస్తుంది. డెంగ్యూతో చాలా మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెంగ్యూకు ఇంతవరకు నిర్ధిష్టమైన మందులు, చికిత్స విధానాలు లేవు. తాజాగా.. డెంగ్యూ వ్యాధికి తొలి ఔషధాన్ని 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ రూపొందించింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది.