(అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి) భారతీయుల మదిలో అహింసామూర్తిగా గుడికట్టుకున్నారు మహాత్మ గాంధీ. మన దేశానికి సంబంధించిన తొలి డాక్యుమెంటరీస్ లో మహాత్ముడే ఎక్కువగా కనిపించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మహాత్మ గాంధీ చేస్తున్న అహింసా పోరాటాలను నిక్షిప్తం చేయాలని భావించి, ఆ దిశగా డాక్యుమెంటరీలు రూపొందించారు. అలా నిక్షిప్త పరచిన మహాత్ముని దృశ్యాలనే ఈ నాటికీ చూడగలుగుతున్నాం. ముఖ్యంగా దండి వద్ద బాపూజీ చేసిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీపై చిత్రీకరించిన విజువల్స్…