తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి నెల వరకు పదవీ కాలం పొడిగించింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఏఐఎస్ (సీఎస్–ఆర్ఎం)…
* నేడు జపాన్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. సెమీ కండక్టర్లతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్న మోడీ * నేడు ఉదయం 8.30 గంటల వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, కొత్తగూడెం జిల్లాల్లో…
కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో చోటుచేసుకున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బీబీపేట పెద్ద చెరువు ప్రమాదకరంగా మారింది. చెరువుకు బుంగ పడటం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా బీబీపేట దిగువన ఉన్న షేర్ బీవీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది విద్యా శాఖ. Also Read: Telangana Flood Rescue : తెలంగాణలో ఇవాళ 1,444…
దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్…
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) పోతారెడ్డిపేట పెద్ద చెరువు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ఉదృతిలో చిక్కుకుపోయారు. రాత్రంతా రైతులు గోపాల్, సుదర్శన్, రాజు వాగులోనే ఉన్నారు. తమను రక్షించాలని అధికారులను వేడుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ముగ్గురు రైతులని రక్షించేందుకు రంగంలోకి SDRF టీం దిగింది. పోతారెడ్డిపేట వాగులో చిక్కుకున్న రైతులను బోటులో వెళ్లి…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, ఆకస్మిక వరదలతో రాష్ట్రం వణికిపోతోంది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అల్పపీడనం కొనసాగుతున్నందున కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ లో పరిస్థితి మళ్ళీ చాలా దారుణంగా ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రాబోయే 4 గంటల్లో మరింత తీవ్రమైన వర్షాలు కురుస్తాయని తెలిపింది. Also Read:Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10…
* నేటి నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ * తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక.. భద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన * తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. నేడు ఏరియల్…