Off The Record:పార్టీ ప్లీనరీకి సిద్ధమవుతుంది కాంగ్రెస్. ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే సమావేశాలు పార్టీకి కీలకం. ఈ ప్లీనరీ కోసం అధిష్ఠానం కీలక కమిటీలను వేసింది. ఆ కమిటీల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం దక్కింది. కాంగ్రెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఏపీసీసీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డిని ఓ కమిటీకి చైర్మన్గా ప్రకటించింది. వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి జేడీశీలం లాంటి నాయకులకు కమిటీలలో…
నూతన పారిశ్రామిక విధానంపై భేటీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. నూతన పారిశ్రామిక విధానంపై ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సందర్భంగా పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.. పరిశ్రమల స్థాపన మొదలు మార్కెటింగ్ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని ఆదేశించిన ఆయన.. మార్కెటింగ్ టై అప్ విధానంపై దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయంగా…
Off The Record: తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంపై ఢిల్లీలోని పార్టీ పెద్దలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా బీజేపీలో చేరికలపై టాప్ టు బాటమ్ కసరత్తు జరుగుతోంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో.. ఎన్నికల తర్వాత కొందరు ఇతర పార్టీల నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకొన్నారు. బీజేపీ నాయకులు ఆశించినట్టు వరదలా చేరికలు లేకపోయినా.. అడపా దడపా చేరినవారు ఉన్నారు. ప్రత్యేకంగా చేరికల కమిటీ వేసినా అనుకున్నంత…
ఎమ్మెల్సీ ఎన్నికలకు.. వైసీపీ అభ్యర్థులు వీరే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సామాజిక సమీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.. మరోపారి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్.. మొత్తంగా.. ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్ కోటాలో అభ్యర్థుల…
మహారాష్ట్రకు చెందిన సాగర్ అనే అభిమాని బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలని ఎమ్మెల్సీ కవితను ట్విట్టర్లో ప్రశ్నించారు. దీనిపై కవిత స్పందిస్తూ దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని సీఎం కేసీఆర్ కు మద్దతు తెలపాలని సూచించారు.